"ఊ కొడతారా...ఉలిక్కి పడతారా" ఆడియో రిలీజ్
on May 31, 2012
"ఊ కొడతారా...ఉలిక్కి పడతారా" ఆడియో రిలీజ్ ఘనంగా జరిగింది. వివరాల్లోకి వెళితే మంచు ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, పద్మశ్రీ, డాక్టర్ మోహన్ బాబు సమర్పణలో, యువరత్న నందమూరి బాలకృష్ణ ఒక ప్రత్యేక పాత్రలో నటించగా, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ హీరోగా, శేఖర్ రాజాని దర్శకుడిగా పరిచయం చేస్తూ, మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న చిత్రం "ఊ కొడతారా...ఉలిక్కి పడతారా".
ఈ చిత్రానికి బోబోశశి సంగీతాన్నందించగా, రాజశేఖర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. లక్ష్మీ భూపాల్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. 'మే' 30 వ తేదీన, హైదరాబాద్ లోని శిల్పకళాతోరణంలో కల శిల్పకళా వేదికపై, సినీ అతిరథ మహారథుల, అశేష అభిమానుల సమక్షంలో, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు చేతుల మీదుగా, యువరత్న నందమూరి బాలకృష్న తొలి కేసెట్ ను అందుకోగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ "ఊ కొడతారా...ఉలిక్కి పడతారా" చిత్రం ఆడియో రిలీజ్ మార్కెట్లోకి విడుదల చేయ