"నెలరాజునీ ఇలరాణినీ కలిపింది కదా సిరివెన్నెలా".. ఇది శాస్త్రిగారి ఆఖరి పాట!
on Dec 4, 2021
"నెలరాజునీ ఇలరాణినీ కలిపింది కదా సిరివెన్నెలా".. ఇది సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చిట్టచివరి పాట. ఆ పాటను ఆయన రాసింది నాని టైటిల్ రోల్ పోషించిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా కోసం. నిజానికి ఆయన ఆ పాట రాయలేదు. పోన్లో ఆయన లైన్లు చెప్తుంటే ఆ సినిమా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ రాసుకున్నాడు. అవును. ఈ నెల 7వ తేదీ ఆ పాట మన ముందుకు రాబోతోంది. ఆ విషయాన్ని ఒక వీడియో ద్వారా కొద్దిసేపటి క్రితం హీరో నాని వెల్లడించాడు.
"మా సినిమాలోంచి నెక్ట్స్ రాబోతున్న పాట నాకూ, మా టీమ్కీ, ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ స్పెషల్ సాంగ్ కాబోతోంది. పాట పేరు 'సిరివెన్నెల'. మన గ్రేటెస్ట్ లెజెండ్స్లో ఒకరు రాసిన ఆఖరి పాట. ఆ పాట వెనుక కథని రాహుల్ మాటల్లో వింటే బాగుంటుందేమో" అని నాని చెప్పాడు.
Also read: అమ్మ మందలించిందని తుంటరిపని చేసి చిన్నప్పుడే ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు!
"నవంబర్ 3వ తేదీ నైట్ కాల్ చేశారు. 'ఆరోగ్యం సహకరించక ఈ పాటను పూర్తిచేయలేక పోతున్నాను. ఇంకెవరితోనైనా రాయిద్దామ'న్నారు. 'పర్లేదు సార్' అన్నాను. మరుసటి ఉదయం 7 గంటలకు వీడియో కాల్ చేసి, నన్ను నిద్రలేపారు. ఆరోజు దీపావళి. 'పల్లవి అయిపోయింది, చెప్తాను రాసుకో' అన్నారు, చాలా ఎగ్జయిటెడ్గా. సడన్గా చెప్పేసరికి ఎక్కడ రాయాలో తెలీక, పక్కనే మహాభారతం పుస్తకం ఉంటే దాని మీద లైన్స్ రాసుకున్నాను. అద్భుతమైన ఆరు లైన్స్ ఇచ్చారు. పల్లవి ఫినిష్ చేశారు. అందులో మొదటి లైన్లో తనపేరు రాశారు. 'ఎందుకు సార్ ఈ పాటకు మీ సంతకం ఇచ్చారు?' అనడిగాను. 'బహుశా ఇదే నా ఆఖరి పాట అవ్వొచ్చు నాన్నా' అని గట్టిగా నవ్వారు. ఐరనీ ఏమిటంటే ఈ పాట రికార్డింగ్ మొదలుపెట్టిన రోజే ఆయన అంత్యక్రియలు కూడా జరిగాయి. పాట చాలా బాగా వచ్చింది సార్. అందుకే మీ పేరే పెట్టుకున్నాం. మీరు వెళ్లిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని ప్రపంచానికి మరొక్కసారి కొత్తగా పరిచయం చేసే అవకాశం మాకు కలిగించినందుకు మా టీమ్ తరపున థాంక్యూ సో మచ్. మిస్సింగ్ యు బ్యాడ్లీ." అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ సాంకృత్యాన్.
Also read: ఆ డైరెక్టర్ తో 'సిరివెన్నెల' ఫోన్ కాల్.. తప్పుగా అర్థం చేసుకోకండి!
"ఈ ఒక్క పాట మాత్రమే కాదు, 'శ్యామ్ సింగ రాయ్'లో ఇంకో పాట కూడా శాస్త్రిగారు రాశారు. ఆ పాట కూడా త్వరలో రిలీజవబోతోంది. ఈ రెండు పాటలనే కాదు, మా సినిమా 'శ్యామ్ సింగ రాయ్'ని సీతారామశాస్త్రిగారికి అంకితమిస్తున్నందుకు నాకూ, మా టీమ్కీ ఎంతో గర్వంగా ఉంది." అన్నాడు నాని.
Also read: సీతారామశాస్త్రికి సుకుమార్ అక్షర నివాళి.. వైరల్ అయిన ఎలిజీ!
మిక్కీ జె. మేయర్ స్వరాలు కూర్చిన సిరివెన్నెల రాసిన చివరాఖరి పాట 7వ తేదీ మనముందుకు రాబోతోంది. దాన్ని అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.
సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన 'శ్యామ్ సింగ రాయ్'లో మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీశర్మ, అభినవ్ గోమటం కీలక పాత్రధారులు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తోన్న ఈ మూవీ డిసెంబర్ 24న విడుదలవుతోంది.
Also Read