నితిన్ టీమ్ న్యూజీలాండ్ వెళుతుందా?
on Jul 3, 2020
న్యూజీలాండ్ కరోనా ఫ్రీ కంట్రీగా అవతరించడంతో... ఫారిన్ బ్యాక్డ్రాప్లో తీయాల్సిన ఎపిసోడ్స్ అక్కడ తీయడానికి సినిమా యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ 'అవతార్' సీక్వెల్స్ షూటింగ్ను న్యూజీలాండ్లో చేస్తున్నాడు ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. కివీస్ గవర్నమెంట్ అనుమతి తీసుకుని చేస్తున్నారు. నితిన్ 'రంగ్ దే' టీమ్ కూడా న్యూజీలాండ్ వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నదట.
నితిన్ హీరోగా, కీర్తీ సురేష్ హీరోయిన్గా 'తొలిప్రేమ' సినిమా ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా 'రంగ్ దే'. ఇందులో ఫారిన్ బ్యాక్డ్రాప్ ఎపిసోడ్ ఉంది. ముందు స్పెయిన్లో షూట్ చేయాలని అనుకున్నారు. కరోనా వల్ల షెడ్యూల్స్ అన్నీ రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు స్పెయిన్ వెళ్లడం కంటే న్యూజీలాండ్ వెళ్లడం బెటర్ అని ప్లాన్ చేస్తున్నారట. కివీస్ గవర్నమెంట్ పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నట్టు టాక్. ఒకవేళ పర్మిషన్ వస్తే 14 రోజులు యూనిట్ అందరూ క్వారంటైన్ లో ఉండి, తరవాత షూటింగ్ చేయాలి.