`రెండువారాలకో సినిమా` బాటలో రాక్ స్టార్!
on Jan 29, 2022
గత నెలలో విడుదలైన `పుష్ప - ద రైజ్`తో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ చూశాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ఇక కొత్త సంవత్సరంలోనూ తన స్వరాలతో ఎంటర్టైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే జనవరిలో `రౌడీ బాయ్స్`, `గుడ్ లక్ సఖి` చిత్రాలతో సందడి చేసిన డీఎస్పీ.. ఫిబ్రవరిలోనూ రెండు సినిమాల పాటే పాడబోతున్నాడు. ఆ నెలలోనూ `ఖిలాడి`, `ఆడవాళ్ళు మీకు జోహర్లు` చిత్రాలతో పలకరించబోతున్నాడు దేవి శ్రీ ప్రసాద్.
Also Read: తారక్ తో మరోసారి డీఎస్పీ!?
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో దేవి శ్రీ నుంచి వచ్చిన, వస్తున్న చిత్రాలన్నీ కూడా రెండు వారాల వ్యవధిలో థియేటర్ బాట పడుతున్నాయి. జనవరి 14న `రౌడీ బాయ్స్` రిలీజ్ కాగా.. ఆపై రెండు వారాల తరువాత అంటే జనవరి 28న `గుడ్ లక్ సఖి` వచ్చింది. కట్ చేస్తే.. మరో రెండు వారాల అనంతరం అంటే ఫిబ్రవరి 11న `ఖిలాడి` రాబోతోంది. ఆపై మరో రెండు వారాల తరువాత అంటే ఫిబ్రవరి 25న `ఆడవాళ్ళు మీకు జోహార్లు` తెరపైకి రాబోతోంది. మొత్తంగా.. రెండు వారాలకో సినిమా బాటలో రాక్ స్టార్ ముందుకు సాగుతున్నాడన్నమాట.
Also Read: నానితో సేమ్ టు సేమ్!
మరి.. జనవరిలో వచ్చిన `రౌడీ బాయ్స్`, `గుడ్ లక్ సఖి`తో హిట్స్ కొట్టలేకపోయిన డీఎస్పీ.. ఫిబ్రవరిలో రానున్న `ఖిలాడి`, `ఆడవాళ్ళు మీకు జోహార్లు`తోనైనా బాక్సాఫీస్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.