క్రేజీ అప్డేట్.. తారక్ కి జోడీగా ఆలియా భట్!
on Jan 29, 2022
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్నా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'లో తారక్, ఆలియా నటించారు. అయితే ఆ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా ఆలియా కనిపించనుంది. ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న NTR30 లో తారక్ సరసన ఆలియా నటించనుందని న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియాతో పాటు కియారా అద్వానీ, రష్మిక మందన్న పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఆలియానే తారక్ కి జోడీగా ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. ఫిబ్రవరి 2 న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
తారక్-కొరటాల పాన్ ఇండియా మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. తారక్ ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' పూర్తి చేశాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మార్చి 18 లేదా ఏప్రిల్ 28 న విడుదల కానుంది. ఇక కొరటాల విషయానికొస్తే చిరంజీవి హీరోగా 'ఆచార్య' సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సినిమా 'గంగూబాయి కతియావాడి' ఫిబ్రవరి 25 న రిలీజ్ కానుంది.