"నిప్పు"కి యు/ఎ సర్టిఫికేట్
on Feb 13, 2012
"నిప్పు"కి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే బొమ్మరిల్లు వారి పతాకంపై, మాస్ మహరాజా రవితేజ హీరోగా, దీక్షా సేథ్ హీరోయిన్ గా, గుణశేఖర్ దర్శకత్వంలో, దర్శక, నిర్మాత వై.వి.యస్.చౌదరి నిర్మించిన చిత్రం"నిప్పు". ఈ "నిప్పు" చిత్రం ఫిబ్రవరి 13 వ తేదీన సెన్సారుకెళ్ళింది. సెన్సారు వారు ఈ "నిప్పు" చిత్రానికి "యు/ఎ" సర్టిఫికేట్ ని ఇచ్చారు. ఈ "నిప్పు" చిత్రం ఫిబ్రవరి 17 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ "నిప్పు" చిత్రానికి తమన్ సాయి అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందింది. ఈ "నిప్పు" చిత్రంలో శ్రీరాం, భావన అతిథి పాత్రల్లో, ఒక ముఖ్య పాత్రలో నటకిరీటి, డాక్టర్ రాజేంద్రప్రసాద్ లు నటిస్తున్నారు. ఈ చిత్రం హిట్టవటం దర్శకుడు గుణశేఖర్ కీ, నిర్మాత చౌదరికీ చాలా ముఖ్యం.