ఆ నిర్మాతలపై దాడి చేశారు!
on Aug 2, 2016
మంచు మనోజ్ హీరోగా నటిస్తోన్న ఓ సినిమా షూటింగ్ కోసం రెండు వారాల క్రితం వైజాగ్ వెళ్ళాడు. అయితే నిన్న రాత్రి సడెన్ గా అక్కడ మీడియా వారిని కలవమని మెసేజ్ ఇచ్చాడు. అసలేం జరిగిందా..? అని అందరూ అనుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి కొందరు రౌడీలు వచ్చి చిత్ర నిర్మాతలు అచ్చిబాబు, ఎస్.ఎన్.రెడ్డి లపై దాడి చేశారు. నిజానికి ఇండస్ట్రీ నియమాల ప్రకారం జూనియర్ ఆర్టిస్ట్స్ గా లోకల్ వాళ్ళను తీసుకోవాలి. అది కూడా ఫెడరేషన్ లో నమోదు చేసుకున్న వారిని మాత్రమే. నిర్మాతలు కూడా అలాంటి వారినే ఎన్నుకున్నారు. కానీ కొందరు రౌడీలు తమ వారినే తీసుకోవాలని నిర్మాతలపై ఒత్తిడి చేశారు. ఒప్పుకోకపోవడంతో వారిపై దాడి కూడా చేశారు. నిర్మాతలకు స్వల్ప గాయాలవ్వడంతో మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.