సెప్టెంబర్ 20న ఆ ముగ్గురి ఫస్ట్ లుక్
on Sep 12, 2013
అక్కినేని మూడు తరాల నటులు కలిసి నటిస్తున్న చిత్రం "మనం". ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 50 శాతంకు పైగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు(సెప్టెంబర్ 20)న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన శ్రియ, చైతన్య సరసన సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.