ప్రీతిజింతా పై అరెస్ట్ వారెంట్
on Sep 13, 2013
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ లెవన్ సహ యాజమాని అయిన ప్రీతి జింటాకు చంఢీగడ్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటును జారీ చేసింది. గతకొద్ది కాలంగా ప్రీతి ఓ చెక్కు బౌన్సు కేసులో ఇరుక్కొని సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఇదే విషయంపై కోర్టుకు హాజరు కావాలని అనేక సార్లు ఆదేశించినప్పటికి కూడా దాన్ని లెక్కచేయకుండా, కోర్టుకు హాజరు కాలేదు. దాంతో కోర్టు ఈ అమ్మడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటును జారీ చేసింది. మరి ప్రీతి దీనికి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.