సింహ గర్జన చేసిన లెజెండ్ ఆడియో
on Mar 7, 2014
"సింహ" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న "లెజెండ్" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రాజమౌళి, శ్రీనువైట్ల ముఖ్య అతిధులుగా విచ్చేసారు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు అభిమానులకు ఒక పండగ వాతావరణాన్ని తలపించాయి. అభిమానుల కోసం ఈ చిత్ర ట్రైలర్ ను మాత్రమే విడుదల చేసారు. మరికొద్ది రోజుల్లో పాటల వీడియో ట్రైలర్స్ కూడా విడుదల చేయనున్నారు. వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో, 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. జగపతి బాబు విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయబోతున్నారు.