అభిమానులకు... స్వీట్ షాకిచ్చిన బాలయ్య
on Dec 22, 2018
బాలకృష్ణ నటిస్తూ, నిర్మించిన `ఎన్టీఆర్` బయోపిక్ చిత్రం ఆడియే వేడుక శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు కన్నుల పండుగగా ఎన్టీఆర్ కుటుంబమంతా హాజరైంది. నందమూరి అభిమానలు ఎన్టీఆర్ కుటుంబాన్ని ఒకే వేదికపై చూసి ఉబ్బి తబ్బుబ్బి పోయారు. తెలుగు వారి సంప్రదాయం ఉట్టిపడేలా బాలయ్య పంచెకట్టులో దర్శనమిస్తూ అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. ఇలా ఆడియో ఒక వైపు అందరిలో ఆనందాన్ని నింపితే...మరోవైపు ఎన్ బి కే బేనర్ లో తన తదుపరి చిత్రాన్ని ఎనౌన్సి చేసి అభిమానలుకు స్వీట్ షాకిచ్చాడు బాలయ్య.
బాలకృష్ణ, డైరక్టర్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన `సింహా`, లెజెండ్ చిత్రాల ఓ రేంజ్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత మళ్లీ బాలయ్య, బోయపాటి కలయికలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన నందమూరి అభిమానుల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ వేస్తూ బాలయ్య `ఎన్టీఆర్` ఆడియో వేడుకలో తన తదుపరి చిత్రం బోయపాటితో అంటూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి లో సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలయ్య సొంత బేనర్ ఎన్బీకే లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో బోయపాటి స్క్రిప్టు ని రెడీ చేసినట్టు తెలుస్తోంది.