English | Telugu

Biggboss 8 Nominations : నామినేషన్లలో యష్మీకే అత్యధికం..  తనకి ఇదే చివరి వారమా!

బిగ్‌బాస్ మొత్తానికి మూడో వారంలోకి అడుగుపెట్టేసింది. అయితే గత రెండు వారాలుగా నామినేషన్ల నుంచి తప్పించుకుంటు వస్తున్న యష్మీకి ఈసారి కంటెస్టెంట్లు గట్టిగానే నామినేషన్ చేశారు. రెండు వారాల నుంచి నామినేట్ చేద్దామనుకున్న వాళ్లంతా ఈ వారం గుద్దిపడేశారు. ఇప్పటికే హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

మొదటి వారంలో గత సీజన్ శోభాశెట్టిని గుర్తుచేసిన యష్మీ.. రెండో వారంలో మిగిలిన కంటెస్టెంట్లతో నరకం స్పెల్లింగ్ రాయించింది. చీఫ్ అయ్యాననే గర్వంతో ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేసింది. ఇక దీనికి యష్మీ టీమ్ కూడా తానా అంటే తందానా అన్నారు. ఇలా యష్మీ బిహేవియర్ చూసి ఆడియన్స్ ఎలిమినేట్ చేసేయండి నాగార్జున గారు అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే డిమాండ్ కూడా చేశారు. మరోవైపు యష్మీకి నామినేషన్లలో ఓటేసి పంపేద్దామనుకున్న కంటెస్టెంట్లకి గత రెండు వారాలు బిగ్‌బాస్ దయ వల్ల ఆ అవకాశం దొరకలేదు. కానీ మూడో వారం మాత్రం యష్మీ నామినేషన్ లో ట్రోలర్స్ కి దొరికేసింది.

మణికంఠ, సోనియా, సీత సహా చాలా మంది కంటెస్టెంట్లు సోనియాకే గుద్దిపడేశారు. దీంతో అత్యధిక ఓట్లతో ఈవారం నామినేషన్లలోకి అడుగుపెట్టింది యష్మీ. దీని గురించి తెలియగానే యష్మీ యాంటీ ఫ్యాన్స్, చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. రా అమ్మా మెరుపు తీగ.. ఈసారి నిన్ను ఇంటికి పంపకపోతే చూడు, వెల్కమ్ యష్మీ ఇదే నీకు చివరి నామినేషన్ అంటు నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.