English | Telugu

అది నైట్ త‌రువాతే అంటూ శ్రీ‌ముఖి రచ్చ‌

కోవిడ్ కార‌ణంగా ఓటీటీల‌కు కొత్త ఊపొచ్చింది. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు కుప్పులు తెప్ప‌లుగా రియాలిటీ షోల‌తో పాటు కొత్త కొత్త సినిమాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. ఇదే క్ర‌మంలో తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా` వ‌రుస‌గా స‌రికొత్త టాక్ షోల‌తో ర‌చ్చ చేయ‌డం మొద‌లుపెట్టింది. ఇటివ‌లే హీరో నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో `అన్ స్టాప‌బుల్‌` ని ప్రారంభించి ఆహా అనిపించారు.

తాజాగా మ‌రో షోకు తెర‌లేపారు. ఇప్ప‌టికే జెమినీ టీవీలో అన‌సూయ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `మాస్ట‌ర్ చెఫ్‌`కి ధీటుగా `ఆహా` ఓటీటీ కోసం `ఛెఫ్ మంత్ర` పేరుతో కొత్త షోకి శ్రీ‌కారం చుడుతున్నారు. ఇదే ఓటీటీలో మంచు ల‌క్ష్మి హోస్ట్‌గా `ఆహా భోజ‌నంబు` పేరుతో ఓ షోని ఇప్ప‌టికే ప్ర‌సారం చేశారు. దానికి ఆశించిన స్థాయిలో ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. దీంతో మ‌రింత కొత్త‌గా `మాస్ట‌ర్ చెఫ్‌`కి ధీటుగా వుండాల‌ని `ఛెఫ్ మంత్ర‌`ని మొద‌లుపెట్టారు.

స‌రికొత్త‌గా ప్ర‌జెంట్ చేయ‌బోతున్న ఈ షోకు హోస్ట్‌గా బుల్లితెర గ్లామ‌ర్ డాల్ శ్రీ‌ముఖి వ్య‌వ‌హ‌రిస్తోంది. జెమిని టీవీలో ప్ర‌సారం అవుతున్న`మాస్ట‌ర్ చెఫ్‌`కి ఆహా `ఛెఫ్ మంత్ర‌`కున్న తేడా ఏంటంటే ఇందులో ప‌లు రుచిక‌ర‌మైన వంట‌కాల‌ని ప‌రిచ‌యం చేస్తూనే ప‌లువురు సెల‌బ్రిటీల‌తో ఈ షోని మ‌రింత క‌ల‌ర్ ఫుల్‌గా మ‌లుస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని ఆహా టీమ్ వ‌దిలింది.

ఈ ప్రోమోలో శ్రీ‌ముఖి, సుహాస్‌, శ్రియా, రెజీనా సంద‌డి చేస్తున్నారు. నాకు దోష కావాలి అని శ్రియ ముద్దు ముద్దుగా అడ‌గ‌డం.. డ్రింక్స్ వున్నాయా అని రెజీనా సంద‌డి చేయ‌డం.. అవ‌న్నీ నైట్ త‌రువాతే అని శ్రీ‌ముఖి బ‌దులివ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. స్సై\సీ జాడీని త‌ల‌పై పెట్టుకుని శ్రియ స్వాతిముత్యం డ్య‌మాన్స్ చేయ‌డం.. అయ్య‌య్యో తేలుతున్నారేంటీ?.. అంటూ శ్రీ‌ముఖి అంటున్న తీరు `ఛెఫ్ మంత్ర‌` షో పై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.