English | Telugu

ష‌ణ్ముఖ్‌కు షాకిచ్చిన సిరి మ‌ద‌ర్‌

బుల్లితెర‌ రియాలిటీ షో బిగ్‌బాస్ విమ‌ర్శ‌ల మ‌ధ్య చివరి అంకానికి చేరుకుంటోంది. కంటెస్టెంట్స్ ప‌రంగానూ, హోస్ వ్య‌వ‌హార శైలి ప‌రంగానూ వివాదాల్లో చిక్కుకుండా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ఈ షో తాజాగా కంటెస్టెంట్‌ల పేరెంట్స్ కార‌ణంగానూ వివాద‌స్ప‌ద‌మ‌వుతోంది. హౌస్‌లో ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయిన కంటెస్టెంట్‌ల‌ని ప‌క్క‌న పెడితే ఈ వారం ఎలిమినేష‌న్‌లో మొత్తం ఎనిమిది మంది స‌భ్యులున్నారు.

ష‌న్ను కెప్టెంన్ అయ్యాడు. ఈ నేప‌థ్యంలో హౌస్ మేట్స్‌కి వారి పేరెంట్స్‌, బంధువుల‌ని క‌లిపించే కార్య‌క్ర‌మాన్ని బిగ్‌బాస్ బుధ‌వారం మొద‌లుపెట్టారు. ఇందులో భాగంగా బుధ‌వారం కాజ‌ల్ భ‌ర్త‌, కూతురు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి కాజ‌ల్‌ని స‌ర్‌ప్రైజ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తాజాగా గురువారం మ‌రో ఇద్ద‌రు కంటెస్టెంట్‌లకు సంబంధించిన పేరెంట్స్ రాబోతున్నారు. ముందుగా మాన‌స్ మ‌ద‌ర్ హౌస్‌లోకి రాబోతోంది. ఆ త‌రువాత సిరి మ‌ద‌ర్ ఎంట్రి ఇస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రోమోని బిగ్‌బాస్ తాజాగా విడుద‌ల చేశారు.

ఈ వీడియోలో మాన‌స్ తల్లి కంటెస్టెంట్‌ల‌తో క‌లిసి అల్ల‌రి చేయ‌గా.. సిరి త‌ల్లి రావ‌డం రావ‌డ‌మే ష‌న్నుపై త‌న ఆగ్ర‌హాన్ని చూపించింది. సిరి బాగా ఆడుతోంద‌ని చెప్పిన ఆమె త‌న‌కు ష‌న్ను స‌పోర్ట్ చేస్తున్నాడ‌ని, అయితే త‌న‌ని ప్ర‌తీసారి సిరి హ‌గ్ చేసుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌డం లేద‌ని ష‌న్ను ముఖం మీదే చెప్పేసి షాకిచ్చింది. త‌న‌కు సిరి బాగా ద‌గ్గ‌రైపోతోంద‌ని, అది త‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌డం లేద‌ని చెప్పేయ‌డంతో ష‌న్ను ముఖం ఒక్క‌సారిగా వాలిపోయింది. తాజా ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.