English | Telugu

స్టేజ్‌పై అంద‌రూ చూస్తుండ‌గా సుధీర్ గ‌ల్ల‌ప‌ట్టి క‌న్ను కొట్టేసింది!

బుల్లితెర కామెడీ షో ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌. ఈ షో ద్వారా పాపుల‌ర్ అయిన జోడీ సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌. వీరిద్ద‌రిపై వ‌చ్చిన‌న్ని పుకార్లు మ‌రే జంట‌పై ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. అంత‌గా వార్త‌ల్లో నిలిచారు. ఒక ద‌శ‌లో వీరి క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకున్న షో నిర్వాహ‌కులు రోజా సాక్షిగా సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌ల‌కు ఉత్తుత్తి పెళ్లి తంతుని కూడా నిర్వహించి ఔరా అనిపించారు. ఆ త‌రువాత నుంచి వీరిద్ద‌రు త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌బోతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.

వీరిద్ద‌రూ డ్యాన్స్ షో ఢీ -13లోనూ త‌మ‌దైన రీతిలో ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని నిర్వాహ‌కులు రిలీజ్ చేశారు. గ‌ణేష్ మాస్ట‌ర్‌, ప్రియ‌మ‌ణి, పూర్ణ న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకి మంచు ల‌క్ష్మి, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ షోలో టీమ్ లీడ‌ర్‌లుగా సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా విడుద‌ల చేసిన ప్రోమోలో సుడిగాలి సుధార్‌పై మంచు ల‌క్ష్మి కామెంట్‌లు చేయ‌డం.. దానికి హైప‌ర్ ఆది ఆజ్యం పోయ‌డం న‌వ్వులు పూయిస్తోంది.

ఇక ఇదే వేదిక‌పై `గుంటూర్ టాకీస్ 2` ర‌ష్మీ గౌత‌మ్‌, సుడిగాలి సుధీర్‌తో చేస్తే ఎలావుంటుంద‌ని చిన్న స్కిట్ చేశారు. ఈ స్కిట్‌లో భాగంగా సుడిగాలి సుధీర్ గ‌ల్ల‌ప‌ట్టి ద‌గ్గ‌ర‌కు లాక్కుని కొంటెగా ర‌ష్మీ క‌న్ను కొట్ట‌డంతో పూర్ణ‌, ప్రియ‌మ‌ణి, గ‌ణేష్ మాస్ట‌ర్‌, మంచు ల‌క్ష్మీ త‌దిత‌ర‌లు నోరెళ్ల‌బెట్టేయ‌డంతో ఒక్క‌సారిగా న‌వ్వులు విరిసాయి. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట టాప్ లో ట్రెండ్ అవుతోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.