English | Telugu

"యు ఆర్ మైన్.. అయామ్ యువర్స్".. శ్వేత‌తో ష‌న్ను!

'బిగ్ బాస్'లో ప్రేమకథలకు, రొమాంటిక్ ముచ్చట్లకు కొదవ ఉండటం లేదు. రవి, లహరి మిడ్ నైట్ హగ్ ఇష్యూ ఇంట్లో సభ్యులను ఓ కుదుపు కుదిపింది. అది మరువకముందే మరో గొడవ మొదలయ్యేలా ఉంది. హీరోయిన్ శ్వేతా వర్మను యూట్యూబర్ షన్ను అలియాస్ షణ్ముఖ్ జస్వంత్ ప్రేమలో దింపే ప్రయత్నాలు చేస్తున్నాడు. అది స్కిట్ లో భాగమే!

శ్వేతా వర్మను పడేసే క్రమంలో షన్ను నోరు జారాడు. దాంతో శ్వేతా వర్మ బాధపడింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్ చూడాలి. షన్ను, శ్వేతా వర్మ మధ్య ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే...

'మనకు వచ్చే డీల్ లో లోబోకు హ్యాండ్ ఇచ్చి... మనిద్దరం చెక్కులతో చెక్ అవుట్ అయిపోతే మనీ అంతా మనకే' అని శ్వేతా వర్మ ముందు షన్ను ఓ ప్రతిపాదన పెడతాడు. 'మీకు 50, నాకు 50... 50-50పర్సెంట్' అని ఆమె అంటుంది. 'పెళ్లి చేసుకుందాం శ్వేతా! యు ఆర్ మైన్. అయామ్ యువర్స్' అని షన్ను అన్నాడు. అందుకు ఆమె సరే అంది.

ఆ తర్వాత 'ఐ లవ్యూ శ్వేతా' అని లోబో ప్రపోజ్ చేస్తుంటే మెలికలు తిరిగింది. ఇది చూసిన షన్ను ఫైర్ అవుతాడు. "శాస్త్రిగారూ" అంటూ షన్ను వెనుక శ్వేతా వెళ్ళింది. అప్పుడు 'ఏమైనా అందాం అంటే ముఖం మీద పెయింట్ వేసి కొడుతుంది' అని గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసేలా షన్ను సెటైర్ వేశాడు. అందుకు శ్వేతా వర్మ బాధపడింది. 'దట్ వాజ్ నాట్ ఫన్నీ' అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. షన్ను సారీ చెప్పాడు. తర్వాత ఏమవుతుందో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.