English | Telugu

పెదవి కొరుక్కుపో అంటున్న మల్లి!

భావన లాస్య.. ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ 'మల్లి' అంటే అందరికి సుపరిచితమే. ఎందుకంటే 'మల్లి' సీరియల్. స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ కి విశేష ఆదరణ లభిస్తుంది. మల్లి సీరియల్ లో అరవింద్ ని ఇష్టపడి, ఆ తర్వాత మాలిని కోసం తన ప్రేమను త్యాగం చేసి వదిలి వెళ్తుంది మల్లి. ఆ తర్వాత మల్లి చేస్తోన్న ఆఫీస్ లోనే అరవింద్ జాబ్ కి జాయిన్ అవుతాడు. మాలిని తనని జాబ్ మానేయమని, లేదా అరవింద్ ని జాబ్ మానేయమని చెప్తుంది. నేనెలా చెప్తానను మల్లి అంటుంది. ఇది భోనాల జాతరలో మల్లి, మాలినిల సంభాషణ. మరి మాలిని చెప్పినట్టు మల్లి చేస్తుందా.. దూరంగా వెళ్తుందా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.

అయితే మల్లిగా అందరికి పరిచయమైన భావన లాస్య.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. భావన తండ్రి రైల్వే ఉద్యోగి. కరోనా లాక్ డౌన్ సమయంలో తను చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి విశేషమైన స్పందన రావడంతో, మల్లి సీరియల్ మేకర్స్ తనని సంప్రదించగా తను నటించడానికి ఒకే అంది.‌ ఇప్పటివరకు టెలివిజన్ సీరియల్స్ లో నటించని భావన లాస్యకి 'మల్లి' తన తొలి తెలుగు సీరియల్. కాగా ఇందులో లాస్య ప్రియ ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.

టీవి యాక్టర్స్ ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అవుతున్నారు. అందులో బ్రహ్మముడి సీరియల్ టీమ్ టాప్ లో ఉన్నారు. కాగా ఇప్పుడు మల్లి సీరియల్ లోని లాస్య ప్రియ కూడా చేరింది. ట్రెండింగ్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేస్తూ అదరహో అనిపిస్తుంది భావన లాస్య. ట్రెండింగ్ లో ఉన్న 'సమ్మోహనుడ' పాటకి శ్రీసత్య, వాసంతి, ఇనయా చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు లాస్య ప్రియ ఈ పాటకు అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది. మాములుగానే ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోస్, రీల్స్ తో బిజీగా ఉండే భావన లాస్య.‌. ఏం చేసిన ట్రెండింగ్ అవుతుంది. కాగా ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లోకి మరొక రీల్ చేరింది. భావన లాస్యకి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు.