English | Telugu

ఫిదా మూవీలో సాయి పల్లవి కి డబ్బింగ్...ఆ బాడ్కోని నేనే 


జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. శివాజీ రావడమేమో కానీ కమెడియన్స్ లో నిద్రపోతున్న జోష్ ని నిద్రలేపాడు. దాంతో వాళ్ళు కామెడీ స్కిట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఈ షోలో తాగుబోతు రమేష్ తనను తాను తిట్టుకున్నాడు. ఎందుకంటే సాయి పల్లవి అంటే తనకు ఎంతో ఇష్టమట. ఎంత అందంగా ఉంటది..ఫిదా సినిమాలో "బాడ్కో బలిసిందారా" అంటది కదా ఆ బాడ్కోని నేనే" అంటూ తెగ సంబరపడిపోతూ ఏంటేంటో వాగేశాడు. ఈ స్కిట్ ఇలా ఉండబోతుంటే బులెట్ భాస్కర్- రష్మీ కలిసి ఒక స్కిట్ వేశారు "బయట వర్షం వస్తుంది జాగ్రత్త" అంటాడు భాస్కర్.

"అయ్యో నాకు జలుబు, జ్వరం వస్తుందనగా" అని ఆతృతగా అడుగుతుంది. "కాదమ్మా " అని బులెట్ భాస్కర్ చెప్పగానే "మేకప్ పోతుందేమో అని" అంటూ ఆ వాక్యాన్ని జడ్జ్ శివాజీ ఫిల్ చేసాడు. దాంతో రష్మీ ఫీలైపోయింది. ఇక శివాజీ షో స్టార్టింగ్ లో రాకెట్ రాఘవను అస్సలు మాట్లాడనివ్వకుండా చాలా హడావిడి చేసాడు. దాంతో రాఘవా పాపం చాలా ఫీలైపోయాడు. ఇక ఈ షోకి హీరోయిన్ ఫారియా, శ్రీ సింహ వచ్చారు. వాళ్ళ మధ్యలో నిలబడి డాన్స్ చేసేసరికి శివాజీ గట్టిగా ఒక కామెంట్ చేసాడు. వాళ్ళ మధ్య నువ్వెంత పొట్టిగా ఉన్నవో తెలుసా అన్నాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.