English | Telugu

రష్మీ నోట 'మెరిసింది మేఘం'... ఆశ్చర్యంలో ప్రేక్షకలోకం!

రష్మీ గౌతమ్ యాంకరింగ్ మొదలుపెట్టి ఎనిమిదేళ్లు దాటుతోంది. అయినా తెలుగులో డైలాగులు చెప్పడానికి ఆమె తడబడుతూ ఉంటుంది. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్... హైపర్ ఆది స్కిట్‌లో పెళ్లి కుమార్తె గెటప్ వేసింది చెప్పుకోవచ్చు. 'సుధీర్.. బుల్లితెరలో దూసుకువెళ్ళే నన్ను' అని డైలాగ్ చెప్పాలి. అందులో బుల్లితెరను బల్లితెర చేసేసింది. 'అమ్మా నీకు దణ్ణం పెడతా. అది బల్లితెర కాదు. బుల్లితెర' అన్నాడు ఆది. అప్పుడు 'నన్ను ఇక్కడికి పిలిచి కించపరుస్తారా?' అనబోయి 'కిందపరుస్తున్నారు' అన్నది రష్మీ. చెప్పుకొంటూ వెళితే తెలుగు డైలాగులకు రష్మీ తెగులు పట్టించిన సందర్భాలు చాలా ఉంటాయి. అటువంటి రష్మీ ఇప్పుడు ఏకంగా తెలుగులో పాట పాడి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆషాడం సందర్భంగా 'జీ తెలుగు' ఛానల్ 'ఆషాడంలో అత్తాకోడళ్లు' అని ఒక ఈవెంట్ చేసింది. అందులో సంగీత, రష్మీ గౌతమ్ సందడి చేయనున్నారు. ఇద్దరూ పాటలకు స్టెప్పులు వేశారు. అంతే కాదు, రష్మీ ఓ అడుగు ముందుకు వేసి 'మెరిసింది మేఘం...' సాంగ్ పాడింది. లేటెస్ట్ గా రిలీజైన ఈ ప్రోమో చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. సంగీత అయితే 'అబ్బబబ్బబా... ఇలాంటి మంచి సింగింగ్ నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్' అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ప్రోమో కింద కామెంట్స్ అయితే చాలా వచ్చాయి. రష్మీ సింగింగ్ బావుందని కొందరు, చాలాబాగా పాడిందని ఇంకొందరు ప్రశంసించారు. ఈవెంట్ టెలికాస్ట్ అయితే ఫుల్ సాంగ్ ఎలా పాడిందో వినొచ్చు, చూడొచ్చు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.