English | Telugu

నా ఇమేజ్ కి బిగ్ బాస్ కరెక్ట్ కాదబ్బా

బిగ్ బాస్ న్యూ సీజన్ రావడానికి ఇంకెంతో టైం లేదు. ఐతే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇది అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్ లో ‘చక్రవాకం’, మొగలి రేకులు సీరియల్స్ ఫేమ్ ఇంద్రనీల్ కూడా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంద్రనీల్ మాత్రం తాను ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లడం లేదంటూ ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసాడు. తాను బిగ్ బాస్ కు సెలెక్ట్ అయ్యానని, ఇంటర్వ్యూలకు కూడా వెళ్లానని చెప్పాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి మాత్రం వెళ్ళాను అనే విషయం బల్లగుద్ది చెప్పేసాడు. "నన్ను అభిమానించే ఫ్యాన్స్‌కి చెప్పేది ఏంటంటే..నేను బిగ్ బాస్‌ హౌస్ లోకి వెళ్లడం లేదు.

ఎప్పటినుంచో ఈ మాట చెప్పాలని అనుకుంటున్నా. నాకు బిగ్ బాస్ టీమ్ కాల్ చేసినప్పుడు ఇదే మాట చెప్పా. నాకు ఇంట్రస్ట్‌ లేదని చెప్పాను. అప్పుడు నా భార్య మేఘన నా పక్కనే ఉంది. కనీసం ఒక్క ఇంటర్వ్యూకి అయినా రండి అన్నారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు. సరేనని ఇంటర్వ్యూకి వెళ్లాను. అక్కడ వాళ్లు చాలా ప్రశ్నలు అడిగారు. అవి నాకు చాలా విచిత్రంగా అనిపించాయి. నాకు తెలిసిన సమాధానాలు చెప్పేసి వచ్చాను. రెండు వారాల తర్వాత మళ్లీ ఇంటర్వ్యూకు పిలిచారు. ఈసారి ముంబయి టీం వాళ్లు ఇంటర్వ్యూ చేశారు. బిగ్ బాస్ అప్ కమింగ్ ఆర్టిస్ట్‌లకు హెల్ప్ అవుతుంది. నాలాంటి వాళ్లకి మాత్రం కాదు. నా ఇమేజ్‌కి బిగ్ బాస్ కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్‌ హౌస్ లోకి వెళ్లిన తరువాత గొడవలు ఉంటాయి. నామినేషన్స్ సమయంలో అగ్రెసివ్ గా ఉండాలి. ఫైట్స్ ఉంటాయి. ఇవన్నీ ఊహించుకున్న తర్వాత బిగ్ బాస్‌కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను’ అని క్లారిటీ ఇచ్చేశాడు ఇంద్రనీల్.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.