English | Telugu

Bigg Boss Season 8: బిగ్‌బాస్‌ 8 ఫైనల్‌ లిస్ట్‌.. కామన్ మ్యాన్ ఎవరంటే!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో హౌస్ లోకి ఎవరెవరు వెళ్తారా అనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ఇక రివ్యూలు, ఫ్యాన్ పేజీలు కంటెస్టెంట్స్ లిస్ట్ లు ఎవరికి వారే ఇస్తున్నారు. వీరిలో ఎవరు కన్ఫమ్? ఎవరు కాదనేది సండే రోజే తెలుస్తుంది. ఎందుకంటే చివరి నిమిషం వరకు హౌస్ లోకి ఎవరు వెళ్తారనేది ఉత్కంఠభరితంగానే ఉంటుంది.

ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పటికే యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో చాలామంది చెప్పేశారు. ఇక హౌస్ లోకి ఎవరు వెళ్తారనేది ఓసారి చూసేద్దాం. ఆదిత్య ఓం, నిఖిల్‌ మళియక్కల్‌, అంజలి పవన్‌, యష్మీ గౌడ, అభయ్‌ నవీన్‌, యాంకర్‌ విష్ణుప్రియ, అభిరామ్‌ వర్మ, కిర్రాక్‌ సీత, ఖయ్యూం అలీ, నాగ మణికంఠ, సోషల్‌ మీడియాలో ఇన్‌ ఫ్లూయన్సర్‌ బెజవాడ బేబక్క , రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసుతో సంచలనంగా మారిన ఆర్జే శేఖర్‌ భాషా, సాహర్‌ కృష్ణన్‌, కళ్యాణి, విస్మయశ్రీ, నైనిక అనసురు, సోనియా ఆకుల ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది.

గత బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో చెప్పనవసరం లేదు. కామన్ మ్యాన్ గా వచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ కి జనాలు విశేషంగా ఆదరించడంతో దానికి అంతటి క్రేజ్ వచ్చింది. నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ ఉంటే అత్యధిక ఓటింగ్ లభించేది. అది కూడా అర్బన్, రూరల్ రెండు ఓటింగ్స్ గట్టిగానే వచ్చాయి. బిగ్ బాస్ ఆల్ టైమ్ రికార్ట్స్ లో విలేజ్ నుండి మిస్ డ్ కాల్స్ అత్యధికంగా వచ్చిన ఏకైక కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. మరి ఇప్పుడు అలాంటి కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరు వస్తారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.