Read more!

English | Telugu

కార్తీకదీపంలో కౌశల్...మాటల్లేని పాత్రలో ఇలా వచ్చి అలా వెళ్ళాడు

కార్తీక దీపం సీజన్ 2 రోజురోజుకు మంచి ఇంటరెస్టింగ్ గా సాగుతోంది. ఇక ఇందులో స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ గా కౌశల్ మందా గురువారం ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. కార్తిక్ మరదలు జ్యోత్స్నా "మిస్ హైదరాబాద్ 2024 " పోటీల్లో పార్టిసిపేట్ చేసింది. ఈ పోటీల్లో జ్యోత్స్నా గెలిచింది. దాంతో కౌశల్ మందాని స్టేజి మీదకు ఇన్వైట్ చేసి అతనితో ఆమె మెడలో టాగ్ ని, అలాగే తల మీద కిరీటాన్ని పెట్టించారు. రీసెంట్ గా కార్తీక దీపం సీరియల్ లాంచింగ్ టైంలో దీప, కార్తీక్ కొన్ని ఇంటర్వ్యూస్ లో పార్టిసిపేట్ చేశారు. ఇక వాళ్ళు కూడా ఈ సీరియల్ లో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను దాచాం నెమ్మదిగా బయటికి తీస్తాం అని చెప్పుకొచ్చారు. మరి ఆ ట్విస్ట్ ఐతే ఇప్పుడు అర్ధమయ్యింది.  అలా కార్తీక దీపం సీరియల్ లో కౌశల్ మందాని ఇంట్రడ్యూస్ చేశారు.

మరి అతని రోల్ రాబోయే ఎపిసోడ్స్ లో ఏమన్నా ఉంటుందా ..చూడాలి. కౌశల్ మందానే కాదు ఇంకా ఎవరెవరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారో ఈ సీరియల్ టీమ్.. కౌశల్ కూడా జేమ్స్ బాండ్ రేంజ్ లో స్టేజి మీదకు అందరికీ ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ సూటు బూటుతో టిప్ టాప్ గా వచ్చాడు. ఐతే కౌశల్ మందాకి ఇందులో ఎలాంటి డైలాగ్స్ ఐతే లేవు. సింపుల్ గా కిరీటం పెట్టేసి వెళ్లిపోవడం మాత్రమే. కానీ కౌశల్ తో ఒక రెండు మాటలన్నా మాట్లాడించి ఉంటే బాగుండేది కౌశల్ పాత్ర కేవలం ముఖ స్తుతి కోసం కావాలని తెచ్చిపెట్టినట్టుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్, నెటిజన్స్.. ఏదైనా ఇంటరెస్టింగ్ గా మాట్లాడించి ఉంటే ఆడియన్స్ అటెంషన్ ఇంకా పెరిగేది అంటున్నారు. ఐతే కౌశల్ బిగ్ బాస్ 2 లో టైటిల్ ని విన్ అయ్యాడు. సిల్వర్ స్క్రీన్ కంటే కూడా స్మాల్ స్క్రీన్ బాగా అచ్చి వచ్చింది. అలాగే కౌశల్ గతంలో కొన్ని సీరియల్స్ లో నటించాడు. చక్రవాకం, బృందావనం, సూర్యవంశం, అగ్నిసాక్షి వంటి కొన్ని సీరియల్స్ లో నటించాడు. అలాగే సినిమాల విషయానికి వస్తే తమ్ముడు, రాజకుమారుడు, బద్రి, శ్రీరామ్, వెంకీ, కామెడీ ఎక్స్ప్రెస్,  మనసంతా నువ్వే, మిస్టర్ పర్ఫెక్ట్, దరువు, నేను నా రాక్షసి ఇలా చాలా సినిమాల్లో నటించాడు.