English | Telugu
కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటన...అంత ఈజీగా చంపకూడదు!
Updated : Aug 22, 2024
ఆట సందీప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆట అనే డాన్స్ షోనే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నంత గొప్ప కొరియోగ్రాఫర్. అలాంటి సందీప్ తన వైఫ్ జ్యోతి రాజ్ తో కలిసి సోషల్ మీడియాలో డాన్స్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అంటూ వీడియోస్ చేస్తూ రాని వారందరికీ డాన్స్ తన వీడియోస్ ద్వారా డాన్స్ నేర్పిస్తూ ఉంటారు.
వీళ్ళు నీతోనే డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక రీసెంట్ గా కోల్కతా ట్రైనీ డాక్టర్ విషయం ఎంతలా దేశాన్ని కుదిపేసిందో మనకు తెలుసు. చాలామంది కూడా భారతదేశంలో పుట్టినందుకు కూడా సిగ్గు పడుతున్నాం అంటూ చెప్తున్నారు.. అందులో చిన్మయి శ్రీపాదా కూడా ఇలాంటి ఎన్నో కామెంట్స్ ని కూడా చేసింది. ఇక ఇప్పుడు సందీప్ భార్య జ్యోతిరాజ్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేసింది ఈ ఘటన మీద. "భారత్ మాతాకి జై. ఒక్కోసారి మనం భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంటుంది. మన కట్టు, బొట్టు, మన ఎథిక్స్, మన దేవుళ్ళు, మన పూజలు, మన సంప్రదాయాలు, మన పురాణాలు, మన ఎమోషన్స్ ఇవన్నీ కూడా. కానీ ఒక స్త్రీని గౌరవించుకునే విషయంలో, ఒక స్త్రీని కాపాడుకునే విషయంలో, తప్పు చేసిన వారిని శిక్షించే విషయంలో ఇండియా చాలా వెనుకబడి ఉంది.
హైలైట్ ఏంటంటే అతి కిరాతకంగా చిన్నపిల్లలను, ఆడపిల్లలను చంపేస్తున్నారు. ఐనా చంపిన వాళ్ళు బతికేవున్నారు. జైలుకు మాత్రమే వెళ్లారు. వాళ్లకు ఎలాంటి శిక్ష పడింది అన్నది ఇంతవరకు ఎవరికీ తెలీదు. ఈ దేశంలో ఎంతమంది అమ్మాయిలు చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళను అంత ఈజీగా ఉరి తీసేసి చంపకూడదు. వాళ్లకు కచ్చితంగా నరకం చూపిస్తూ చంపాలి. " అంటూ జ్యోతి ఒక వీడియో మెసేజ్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.