English | Telugu

జానకి కలగనలేదు vs మనసిచ్చిచూడు

ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు `స్టార్ మా`లోని పాపుల‌ర్ టెలివిజ‌న్ న‌టీన‌టుల‌తో యాంక‌ర్ ఝాన్సీ నిర్వ‌హిస్తున్న షో `స్టార్ మా ప‌రివార్ లీగ్‌`. గ‌త కొన్ని వారాలుగా రెండు పాపుల‌ర్‌ సీరియ‌ల్స్ కు సంబంధించిన న‌టీన‌టుల‌ని రెండు టీమ్ లుగా ఏర్పాటు చేసి వారి మధ్య‌ పోటీని నిర్వ‌హిస్తూ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు. గ‌త ఆదివారం 'దేవ‌త‌', 'రాఖీ పూర్ణిమ' సీరియ‌ల్ కు చెందిన న‌టీన‌టులు పోటీప‌డ్డారు. సెమీ ఫైన‌ల్ లో భాగంగా జ‌రిగిన ఈ పోటీలో 'దేవత' టీమ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. ఇక ఈ ఆదివారం అంటే జూన్ 5న మ‌రో రెండు సీరియ‌ల్స్ టీమ్స్ పోటీప‌డ‌బోతున్నాయి.

జూన్ 5న 'జానకి కలగనలేదు', 'మనసిచ్చిచూడు' టీమ్ లు పోటీప‌డుతున్నాయి. 'జానకి కలగనలేదు' టీమ్ నుంచి అమ‌ర్ దీప్ చౌద‌రి, అనిల్ అల్లం, విష్ణు ప్రియ‌, మ‌రోన‌టి పాల్గొన్నారు. ఇక `మనసిచ్చిచూడు` సీరియ‌ల్ నుంచి మ‌హేష్ (ఆది), కీర్తి భ‌ట్‌, త్రిష దంతాల‌, హ‌రితేష్ పోటీకి దిగారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. `ఈ టీమ్స్ ఎలాంటోళ్లంటే ఆడితే అద‌రిపోవాలి.. ఆడాక గుర్తుండిపోవాలి` అంటూ ఝాన్సీ వాయిస్ తో ప్రోమో మొద‌లైంది.

'ఆది, రామా క‌లిసి గేమ్ ఆడితే ఎట్లుంట‌ది ఎస్ ఎమ్ పీఎల్ (స్టార్ మా ప‌రివార్ లీగ్‌) స్టేజ్ ద‌ద్ద‌ద్ద‌రిల్లిపోవాలి' అన్నాడు మ‌హేష్ (ఆది). ఇదిలా వుంటే ఈ రేసులో 'జాన‌కి క‌ల‌గ‌న‌లేదు' టీమ్ కు చెందిన అనిల్ అల్లం, 'మ‌న‌సిచ్చిచూడు' టీమ్ కు చెందిన త్రిష తెగ కామెడీ చేశారు. వీళ్ల‌పై పేలిన వాయిస్ పంచ్ లు న‌వ్వులు పూయిస్తున్నాయి. ఇక `మనసిచ్చిచూడు` నుంచి పాట‌పాడేందుకు వ‌చ్చిన హ‌రితేష్ 'రాములో రాములా' పాట‌ని ఖూనీ చేసేసి న‌వ్వులు పూయించాడు.

ఆ త‌రువాత 'మనసిచ్చిచూడు' నుంచి `కాంచ‌న‌` సాంగ్ తో మ‌హేష్ అద‌ర‌గొట్టేశాడు. ఇక 'జానకి కలగనలేదు' టీమ్ `కేజీఎఫ్ 2` ని పెర్ఫార్మ్ చేశారు. ఫైన‌ల్ గా 'మనసిచ్చిచూడు' టీమ్ నుంచి త్రిష, అమ‌ర్ దీప్ చౌద‌రి చేసిన `అమ్మా అమ్మా.. నీ వెన్నెలా.. ` అంటూ సాగే పాట‌కు అదిరిపోయే పెర్ఫార్మ్ చేసి క‌న్నీళ్లు తెప్పించి మార్కులు కొట్టేశారు. పోటా పోటీగా సాగిన వీరి పెర్ఫార్మెన్స్ ల‌తో ఏ టీమ్ పై చేయి సాధించిందో తెలియాలంటే ఆదివారం జూన్ 5న మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న 'స్టార్ మా ప‌రివార్ లీగ్' చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.