English | Telugu
Guppedantha Manasu : ఎండీ పదవి వద్దని చెప్పిన మను.. షాక్ లో మినిస్టర్!
Updated : Jul 16, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1127 లో..... దేవయాని చేస్తున్న బ్లాక్ మెయిల్ కి అనుపమ బయపడి తన పెద్దమ్మ దగ్గరకి వస్తుంది. కాసేపటికి మనుని రమ్మని చెప్తుంది. మను వచ్చాక ఇక మనం ఇక్కడే ఉండాలని అనుపమ అనగానే.. ఎందుకు? ఏం జరిగిందని మను అడుగుతాడు. ఏం లేదు ప్లీజ్ నేను చెప్పింది విను అని అనుపమ అనగానే.. ఏదో జరిగింది దాస్తున్నారు చెప్పండి అని మను అంటాడు. మీరు ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి.. నా తండ్రి ఎవరో చెప్పండి.. లేదంటే ఈ గన్ తో షూట్ చేసుకుంటానని మను తన తల దగ్గర గన్ పెట్టుకుంటాడు.
ఆ తర్వాత వద్దని అనుపమ అంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి గన్ ని లాక్కుంటాడు.అసలు ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా అని మహేంద్ర అడుగుతాడు. ప్లీజ్ మహేంద్ర మన ఫ్రెండ్ షిప్ పై గౌరవం ఉంటే ఏం అనకని అనుపమ అంటుంది. ఆ తర్వాత మహేంద్ర వెళ్ళిపోయాక.. నీకు నన్ను అమ్మ అని పిలవాలని ఉంది కదా.. నీకు ఎంతుందో నిన్ను అమ్మ అని పిలిపించుకోవాలని నాకు అంతకు పది రేట్లు ఉందని అనుపమ అంటుంది. అమ్మ అని పిలుపు అనగానే.. మను అమ్మ అని పిలిస్తూ ఎమోషనల్ అవుతాడు. నేను చెప్పినట్టు విను మనం ఇక్కడే ఉందాం.. కాలేజీలో కూడ నువ్వు జోక్యం చేసుకోకని అనుపమ అనగానే.. మను సరే అంటాడు. మరొకవైపు రంగా నానమ్మ రాధమ్మ కిందపడిపోతుంది. అప్పుడే వసుధార వచ్చి హెల్ప్ చేస్తుంది. రంగా వస్తాడు. అప్పటికే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తుంది. టైమ్ కి ఎవరు హెల్ప్ చేసి కాపాడారని డాక్టర్ అంటుంది. ఆ తర్వాత రంగా ఎమోషనల్ అవుతూ వసుధారకి థాంక్స్ చెప్తాడు. ఏంటి సర్ ఇంత ఎమోషనల్ అవుతున్నాడు. రిషి సర్ కాదా నిజంగానే రంగానా అని అనుకొని.. లేదు నా రిషి సర్ అని వసుధార అనుకుంటుంది.
ఆ తర్వాత మినిస్టర్ గారు కాలేజీ లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేసానో తెలుసా అని ఎండీ చైర్ గురించి అని మాట్లాడతాడు. నాకు ఈ కాలేజీకి ఎండీ గా మను ఉంటే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నానని మినిస్టర్ అనగానే.. మీరే నిర్ణయం తీసుకుంటే ఎలా అని శైలేంద్ర ఆవేశపడుతుంటే.. ఫణీంద్ర తనపై కోప్పడతాడు.ఆ తర్వాత మనునే ఎండీ అని మినిస్టర్ అనగానే.. అందుకు నేను సిద్దంగా లేనని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.