English | Telugu

తనూజకి ఫేక్ ఓటింగ్.. జెన్యున్ ప్లేయర్స్ కి అన్యాయం జరుగుతుందా!

బిగ్ బాస్ సీజన్-9 లో ఇప్పటివరకు ఎనిమిది వారాలు గడిచాయి. ఇక ఈ ఎనిమిది వారాల్లో ప్రియా, ఫ్లోరా సైనీ, మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, రమ్య మోక్ష, అయేషా, శ్రీజ ఎలిమినేషన్ అయ్యారు. అయితే భరణి ఎలిమినేషన్ అయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎనిమిదో వారం దువ్వాడ మాధురి ఎలిమినేషన్ అయి బయటకొచ్చేసింది.

బిగ్ బాస్ సీజన్-9 లో ఇప్పటివరకు జరిగిన ప్రతీ నామినేషన్లో తనూజ దాదాపుగా ఉంది. అయితే తను హౌస్ లో ఎక్కువ టైమ్ కిచెన్ లో ఉంటుంది. అయితే తన బిహేవియర్ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే తినే ఫుడ్ ని చిరాకుగా సర్వ్ చేయడం ఎవరిది నచ్చదు‌‌.. అందుకే మాస్క్ మ్యాన్ హరీష్ కూడా తనని ఇదే పాయింట్ మీద నామినేషన్ చేశాడు. ఇక తనూజ చిరాకుకి సంజన, మాధురి, రాము, ఇమ్మాన్యుయల్ ఇలా చాలామంది బలయ్యారు కానీ ఎవరు అంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే తనూజ గేమ్ ఆడినా ఆడకపోయిన తనకి మాత్రం ఓటింగ్ భారీగానే ఉంది. అయితే తనకి పడే ఓటింగ్ అంతా ఫేక్ అని, పీఆర్ లు డూప్లికేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎంతలా అంటే తనూజకి ప్రతీ నామినేషన్ లో యాభై నుండి అరవై శాతం ఓటింగ్ పడుతోంది. ఆ తర్వాత కళ్యాణ్ కి ఇరవై నుండి ముప్పై శాతం ఓటింగ్ పడుతోంది. అయితే హౌస్ లో జెన్యున్ గా ఆడే డీమాన్ పవన్, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, దివ్య, భరణి లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది.

ఇప్పటివరకు జరిగిన అన్నీ ఎపిసోడ్ లలో చాలా కాన్ఫిడెంట్ గా జెన్యున్ గా ఆడే వాళ్ళ లిస్ట్ లో సుమన్ శెట్టి నెంబర్ వన్ ఉండగా ఆ తర్వాత దివ్య ఉంది. ఇక మూడో స్థానంలో భరణి ఉన్నాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్ ఉన్నారు. అయితే వీళ్ళు నామినేషన్ లోకి వచ్చినా వీరికంటే ఎక్కువగా తనూజ, కళ్యాణ్ లకి ఓటింగ్ పడుతోంది. అయితే వీళ్ళిద్దరు ఆడి గెలిచింది ఒక్క గేమ్ కూడా లేదు. పైగా కంటెంట్ కూడా ఏం ఇవ్వలేరు. కానీ ఓటింగ్ మాత్రం గట్టిగా పడుతోంది. అంటే ఇదంతా ఫేక్ ఓటింగ్ అని ఆడియన్స్ కి అర్థమైంది. అయితే తనూజ, కళ్యాణ్ లలో ఎవరో ఒకరిని విన్నర్ చేయడానికే బిగ్ బాస్ ప్లాన్ చేశాడనిపిస్తుందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.