English | Telugu

వంటలక్క కంటే నాగ్‌, తారక్‌కు తక్కువే!

సూపర్‌హిట్ సీరియల్ టీఆర్పీని బీట్ చేసే క్రమంలో... స్టార్ అట్రాక్షన్ లక్ష్యానికి కొంతదూరంలో నిలిచింది. వంటలక్కపై బుల్లితెర వీక్షకులకు ఉన్న అభిమానం ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న గేమ్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు', కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ 5'కు తక్కువ టీఆర్పీలు రావడం గమనార్హం.

జెమినీ టీవీలో వస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌కు 11.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దాని త‌ర్వాత‌ ఈ షో హైయ్యస్ట్ రేటింగ్ 11.37. అయితే, టీవీలో ఎన్టీఆర్ బెస్ట్ ఇదేనా? అంటే కాదు అని చెప్పాలి. ఎందుకంటే... ఆయన హోస్ట్ చేసిన 'బిగ్ బాస్ 3'కి 17.9 రేటింగ్ వచ్చింది. దాన్ని 'బిగ్ బాస్ 5'తో నాగార్జున బ్రేక్ చేశారు. 18 టీఆర్పీ రేటింగ్ సాధించారు. అయితే... ఎస్‌డి, హెచ్‌డి మినహాయిస్తే 15.66 మాత్రమే. టీఆర్పీ విషయంలో ఈ రెండు షోస్ కంటే 'కార్తీక దీపం' సీరియల్ ముందంజలో ఉంది.

జూన్ తొలి వారంలో 'కార్తీక దీపం'కు 19.10 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దాన్ని ఎన్టీఆర్, నాగార్జున ఇద్దరూ బీట్ చెయ్యలేకపోయారు. దీన్నిబట్టి వంటలక్కకు ఎంతమంది అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.