English | Telugu

హిమ - జ్వాల అనుబంధంపై శోభ‌ అనుమానం

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ శ‌నివారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుంద‌న్న‌ది ఒక‌సారి చూద్దాం. 'నిరుప‌మ్‌.. జ్వాల‌.. హిమ‌ల మ‌ధ్య ఏదో జ‌రుగుతోంది. అదేంటో తెలుసుకోవాలి.. వీళ్ల గురించి గ‌ట్టిగా ప‌ట్టించుకోవాలి' అని శోభ అనుకుంటూ వుంటుంది. మ‌రో వైపు త‌న‌కు క్యాన్స‌ర్ అని చెప్పినా నిరుప‌మ్ వినిపించుకోక‌పోవ‌డంతో 'ఎందుకు బావా అన్నీ చెప్పినా నా మీద ప్రేమ‌ను పెంచుకుంటున్నావు?' అని అడుగుతుంది హిమ‌.

ఆ మాట‌లు విన్న నిరుప‌మ్ `నీ మీద ప్రేమ ఎప్ప‌టికీ చావ‌దు హిమ‌` అంటాడు. 'అయితే నా ప్రేమ‌ను మీకు వేరేవాళ్ల రూపంలో అందించ‌బోతున్నాను. దాన్ని నువ్వు స్వీక‌రించాలి' అంటుంది. ఇదంతా చాటుగా వున్న శోభ గ‌మ‌నిస్తుండ‌గానే త‌న పేరు జ్వాల అని చెబుతుంది హిమ‌. ఆ మాట‌ల‌కు నిరుప‌మ్ ఆగ్ర‌హించి ఏం మాట్లాడుతున్నావ్ హిమ అని చిరాకు ప‌డ‌తాడు. శోభ మాత్రం ఆ అవ‌కాశం నాకు ఇవ్వొచ్చుక‌దే పోయి పోయి ఆ ఆటోదాన్ని ఎందుకు క‌ట్ట‌బెట్టాల‌నుకుంటున్నావు` అని శోభ మ‌న‌సులో అనుకుంటుంది.

'జ్వాలకు నువ్వంటే ఇష్టం బావ' అని హిమ చెప్ప‌గానే నిరుప‌మ్ షాక‌వుతాడు. త‌న‌నే నువ్వు పెళ్లి చేసుకోవాల‌ని హిమ చెబుతూనే క‌ళ్లు తిరిగి ప‌డిపోతుంది. క‌ట్ చేస్తే శోభ‌లో అనుమానాలు మొద‌ల‌వుతాయి. ఒక డాక్ట‌ర్ కు ఆటోదాన్నిచ్చి పెళ్లి చేయాల‌ని హిమ ఎందుకు అనుకుంటోంది? అని ఆలోచించ‌డం మొద‌లు పెడుతుంది. ఈ రెండు ఫ్యామిలీల మ‌ధ్య ఏదో వుంది. అదే స‌మ‌యంలో జ్వాల చేతిపై వున్న హెచ్ అనే అక్ష‌రం మ‌రింత అనుమానాన్ని బ‌ల‌ప‌రుస్తుంది. హెచ్ అంటే హిమ కాదు క‌దా? అని శోభ ఆలోచ‌న‌లో ప‌డుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.