English | Telugu

Bigg Boss 8 : సోనియాని నోరు అదుపులో పెట్టుకోమన్న నాగార్జున!

బిగ్ బాస్ సీజన్ 8 తాజా ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకాడు హోస్ట్ నాగార్జున. హౌస్ లో వారం మొత్తం కంటెస్టెంట్స్ యెుక్క బిహేవియర్ ని చూసి వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. (Bigg Boss 8 Telugu)

మొదట చీఫ్ ల బాధ్యతలు గుర్తుచేసి వారు సరిగ్గా చేయలేదని చెప్పి యష్మీ, నైనికలని చీఫ్ బాధ్యతల నుండి తొలగించిన నాగార్జున.. హౌస్ లో సోనియాది వరెస్ట్ బిహేవియర్ అంటు వార్నింగ్ ఇచ్చేశాడు. అసలు సోనియా చేసిన తప్పేంటి? నాగార్జున ఏం అన్నాడో ఓసారి చూసేద్దాం...90 మార్క్స్ వస్తాయన్న స్టూడెంట్‌కి 40 మార్క్స్ వస్తే నిరుత్సాహం ఉంటుంది కదా అని నాగార్జున అన్నాడు. నాకు స్కోప్ కనిపించడం లేదు సర్ అని సోనియా అనగానే.. స్కోప్ ఉండదు.. నువ్వు తీసుకోవాలని చెప్పాడు. గత వారం విష్ణు ప్రియ క్యారెక్టర్‌ గురించి చాలా నీచంగా మాట్లాడిన ఇష్యూని లేవనెత్తుతూ వీడియో ప్లే చేశాడు. నిన్ను పట్టించుకోవడానికి ఎవరూ లేరేమో విష్ణుప్రియా.. నాకు ఫ్యామిలీ ఉంది.. పట్టించుకునే వాళ్లు ఉన్నారంటూ సోనియా నోటికొచ్చినట్టు మాట్లాడిన వీడియోని హౌస్ మేట్స్ అందరికి వేసి చూపించాడు.

ఇక అదంతా చూసాక కూడా సోనియా ఎక్కడా తగ్గడం లేదు. నేను గొడవని పెంచాలని అనుకోలేదు సర్ అని సోనియా అనగానే.. నోరు అదుపులో పెట్టుకోవడం చాలా అవసరమని అన్నాడు. నువ్వు ఇలా ఉంటే కుదరదు. ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు.. నువ్వు ఇలాగే ఉంటే వాళ్ళు నిన్ను ఎక్కడ ఉంచుతారో తెలుసు కదా అని నాగార్జున అనగానే.. సోనియా కాస్త భయపడ్డట్టు అనిపించింది‌.‌ మరి హౌస్ లో ఇక నుండి అయినా తన బిహేవియర్ మార్చుకుంటుందో లేదో చూడాలి మరి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.