English | Telugu

Shekar Basha: శేఖర్ బాషా మగజాతి ఆణిముత్యమేనా!

బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో అందరికి గట్టి పోటీ అనిపించేది మాత్రం శేఖర్ బాషా అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే స్టేజి పై నాగార్జున తో మాట్లాడిన విధానాన్ని బట్టి గొడవలకి కొదవ లేదని అనిపించింది.

నాతో ఎవరైనా గొడవ పెట్టుకుంటే కప్ నేనే తీసుకొని పోతానంటూ తన అటిట్యూడ్ తో మాట్లాడాడు. శేఖర్ బాషా RJ గా తన కెరీర్ మొదలుపెట్టాడు. ప్రముఖ టీవీ ఛానెల్ లో యాంకర్ గా పని చేసాడు. దాదాపు 100 గంటలు మాట్లాడిన RJ గా ఎవరికి రాని గుర్తింపు తెచ్చుకుని అవార్డు సొంతం చేసుకున్నాడు బాషా. కానీ చాలా రోజుల పాటు తెరపై కనిపించలేదు. ఆర్జేగా కూడా అంత ట్రెండింగ్ లో లేడు.. మళ్ళీ బిగ్ బాస్ ద్వారా కేరీర్ ని రీస్టార్ట్ చేస్తున్నాడు.

ఒక నెల రోజులుగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా శేఖర్ బాషా పేరే వినిపించింది. హీరో రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో మధ్యలో దూరిన శేఖర్ బాషా మగాళ్ల హక్కుల కోసం పోరాడుతున్నానటూ గట్టిగానే ఫైట్ చేశాడు. యూట్యూబ్ ఛానల్స్‌లో వాదించి చివరికి లావణ్య చేతిలో చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు. అలాంటి శేఖర్ బాషా మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఇండియాలోనే ఇప్పటివరకూ ఆర్జేగా ఎవరూ సాధించనన్ని అవార్డులు గెలుచుకున్నట్లు చెప్పాడు శేఖర్. 18 ఏళ్లలో ఆర్జేగా 8 అవార్డులు గెలుచుకున్నట్లు చెప్పాడు. 15 ఏళ్ల క్రితమే శేఖర్ ఆర్జేగా సూపర్ పొజిషన్‌లో ఉన్నాడు. ఎంతలా అంటే ఉత్తమ ఆర్జేగా అప్పట్లోనే మూడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్నాడు శేఖర్. తాజాగా జరిగిన రాజ్ తరుణ్-లావణ్యల విషయంలో ఫుల్ వైరల్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటాడో చూడాలి మరి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.