Krishna Mukunda Murari : కృష్ణ ముకంద మురారి సీరియల్ కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ.. కృష్ణకి మరో ఇద్దరు శత్రువులా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -434 లో.. భవాని దగ్గరికి వెళ్ళి జరిగినవన్నీ చెప్తుంది. తను ఆదర్శ్ మంచికోసమే చేసిందని కృష్ణ తప్పేం లేదని భవాని అంటుంది. ఇక అదేసమయంలో వదినా అనే పిలిచిన పిలుపు.. అరుపులా వినిపిస్తుంది. దాంతో భవానీ, కృష్ణ గది నుండి బయటికి వస్తారు . రేవతి, సుమలత, మధు అంత ఆ అరుపులకు బయటికి వస్తారు. అయితే బ్యాగ్ పట్టుకుని ఓ తల్లీకూతుర్లు హాల్లో నిలబడి ఉంటారు. ఆ వచ్చిన వాళ్లను.. కృష్ణ తప్ప అంత తెలిసిన ముఖాలని చూసినట్లే చూస్తుంటారు.