English | Telugu

Eto Vellipoyindhi Manasu : ఆమెకు నువ్వు అన్యాయం చేశావ్.. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన సీతాకాంత్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -63 లో.. మాణిక్యాన్ని ఎదిరించి ధనని తీసుకొని వచ్చి పెళ్లి చెయ్యొచ్చు కదా అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సీతాకాంత్ తో అంటాడు. స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు చేసుకొని పెద్దాయనకు చెప్తాడు. జాతకం ప్రకారం ఎదిరించి పెళ్లి చెయ్యవద్దు.. కాళ్ళు కడిగి కన్యాదానం చేసి పెళ్లి చెయ్యాలని స్వామీజీ చెప్పింది పెద్దాయనకి సీతాకాంత్ చెప్తాడు.

అందుకే తాతయ్య ఆ మాణిక్యం ఎన్ని కండిషన్ లు పెట్టినా ఏం అనలేకపోతున్నా అని సీతాకాంత్ పెద్దాయనతో అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి వచ్చి.. అభి వాయిస్ మెసేజ్ చేసాడు ఫారెన్ వెళ్తున్నాడంట, ఒకసారి కలవాలి అంటున్నాడని రామలక్ష్మి చెప్తుంది. మరి వెళ్ళు అంటూ సీతాకాంత్ ఇబ్బందిగా చెప్తాడు. ఇప్పుడు అందరి దృష్టిలో మనం భార్యభర్తలు అలా వెళ్లి మాట్లాడితే.. ఏమైనా అనుకుంటారని రామలక్ష్మి అనగానే.. సరే రేపు వెళదామని సీతాకాంత్ అంటాడు. నువ్వు అభితో మాట్లాడడానికి వెళ్తానంటేనే నాకు ఏదోలా అనిపిస్తుందని సీతాకాంత్ తన మనసులో అనుకుంటాడు..ఆ తర్వాత సీతాకాంత్, రామలక్ష్మి కలిసి మాణిక్యం ఇంటికి వెళ్తారు. అక్కడ రామలక్ష్మి కాపురం గురించి రామలక్ష్మి వాళ్ళ అమ్మ సుజాత అడిగి తెలుసుకుంటుంది. నాకొక వెయ్యి ఇవ్వని సీతాకాంత్ ని‌ మాణిక్యం అడుక్కుంటాడు. కాసేపటికి బయట నుండి కొంతమంది వచ్చి మాణిక్యం మాకు డబ్బులు ఇవ్వాలంటూ గొడవకు వస్తారు. మీకెంత ఇవ్వాలి అంటు సీతాకాంత్ అడిగి.. వాల్ల ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడు.

ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి ధన వస్తాడు. సిరికి అన్యాయం చేసావంటూ ధనపై రామలక్ష్మి కోప్పడుతుంది. నేను అన్యాయం చెయ్యలేదు.. ఎలాగూ పెళ్లి చేసుకుంటామని అలా చేసామని ధన అంటాడు. ఎలాగైనా మా పెళ్లి చెయ్యాలని ధన అనగానే.. రేపే నీకు సిరికి పెళ్లి అని రామలక్ష్మి చెప్తుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. అవును ఈ విషయం మీ నాన్నకి తెలియొద్దని చెప్తాడు. ఆ తర్వాత వీళ్లేదో ప్లాన్ చేస్తున్నారని మాణిక్యం అనుకుంటాడు. ధన దగ్గరికి మాణిక్యం వచ్చి.. ఏదైనా ప్లాన్ చేస్తే నాకు చెప్పు అని చెప్తాడు. సరే అని ధన అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు అగాలిసిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.