English | Telugu
మంచు విష్ణు(Manchu Vishnu)చాలా రోజుల తర్వాత ఈ రోజు మైథలాజికల్, డెవోషనల్ మూవీ 'కన్నప్ప'(Kannappa)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. 'తిన్నడు' అనే నాస్తికుడు, ఆ తర్వాత శ్రీ కాళహస్తీశ్వరుడికి భక్తుడిగా మారి తన రెండు కళ్ళు సమర్పిస్తాడు.ఈ అపర భక్తుడికి సంబంధించిన నిజ జీవిత కథతో కన్నప్ప తెరకెక్కింది.
విరాటపాలెంలో జరుగుతున్న మరణాల మిస్టరీని చేధిస్తూ సాగే కథ ఇది. మొదటి ఎపిసోడ్ నుండి ఏడో ఎపిసోడ్ వరకు ఈ సిరీస్ ఎంగేజింగ్ గా సాగుతుంది. చిన్న పాయింట్ ని చక్కని స్క్రీన్ ప్లే తో ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప' ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
ప్రపంచ సినిమాలో ప్రతి నటుడూ, సాంకేతిక నిపుణుడు ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్. ఆస్కార్ సాధించడమే తమ లక్ష్యంగా పనిచేస్తారు. 1929 మే 16న ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ఆస్కార్ అవార్డుల ప్రక్రియను
'యానిమల్', 'పుష్ప-2', 'ఛావా' వంటి వరుస పాన్ ఇండియా విజయాలతో ఫుల్ జోష్ లో ఉంది రష్మిక మందన్న. 'సికందర్' షాక్ ఇచ్చినప్పటికీ.. రీసెంట్ గా విడుదలైన 'కుబేర'తో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ప్రకటించింది. అది కూడా పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.
మల్టీ టాలెంటెడ్ ఎస్.జె. సూర్య పదేళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'కిల్లర్'. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య హీరోగా నటిస్తుండటమే కాకుండా.. కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు.
హిస్టారికల్, మైథలాజికల్ జానర్స్ లో సినిమాలు చేయడం అంత తేలిక కాదు. ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా ప్రకటన సమయంలో పాజిటివ్ బజ్ ఉండేది. టీజర్ రిలీజ్ తర్వాత అది పూర్తి నెగటివ్ గా మారింది.
ఎట్టకేలకు కన్నప్ప థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమాపై మొదట్లో బాగా నెగటివ్ ఉండేది. సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ తర్వాత కొంచెం కొంచెం పాజిటివ్ గా మారుతూ వచ్చింది. సినిమాలో ఏదో విషయం ఉందనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగేలా చేసింది. అందుకు తగ్గట్టుగానే ఓవర్సీస్ రివ్యూలు పాజిటివ్ గా వస్తున్నాయి.
స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna)రీసెంట్ గా 'కుబేర'(Kuberaa)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. కుబేర సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతు రష్మిక నటన చూస్తే క్షణం క్షణం సినిమాలో 'శ్రీదేవి' ని చూసినట్టుగా ఉందని చెప్పాడు. దీన్ని బట్టి రష్మిక నటనకి ఉన్న స్థాయిని అర్ధం చేసుకోవచ్చు.
మంచు విష్ణు(Manchu Vishnu)మోహన్ బాబు(Mohan Babu)కలల ప్రాజెక్ట్ 'కన్నప్ప'(kannappa)రేపు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రభాస్(Prabhas)మోహన్ లాల్(Mohan Lal)అక్షయ్ కుమార్(Akshay Kumar)శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రచార చిత్రాలతో కన్నప్ప పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. రీసెంట్ గా కన్నప్ప గురించి మోహన్ బాబు రెండవ కుమారుడు ప్రముఖ హీరో 'మంచు మనోజ్'(Manchu Manoj)ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ 'ప్రియాంక చోప్రా'(Priyanka Chopra)ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)రాజమౌళి(ss Rajamouli)కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో చేస్తుంది. ఈ సినిమాకి సంబందించిన మొదటి షెడ్యూల్ లో ప్రియాంక చోప్రా పాల్గొంది.
అక్కినేని నాగార్జున(Nagarjuna),ధనుష్(Dhanush)రష్మిక(Rashmika Mandanna)శేఖర్ కమ్ముల(Sekhar Kammula)కాంబోలో ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీ 'కుబేర'(Kuberaa). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ఎల్ పి, అమిగోస్ సంయుక్తంగా కలిసి నిర్మించగా దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad)సంగీతాన్ని అందించాడు.
పురాణ పురుషుల పాత్రలు పోషించేటప్పుడు నటులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఆ పాత్ర గురించి తమ వంతుగా ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎంత ఎక్కువ సమాచారం తెలిస్తే.. ఆ పాత్రలో అంతగా ఒదిగిపోవచ్చని నటులు నమ్ముతుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ సినిమా కోసం ఇదే పాటిస్తున్నారు. తాజాగా 'మురుగ' పుస్తకంతో దర్శనమిచ్చారు.
మూడు దశాబ్దాల నుంచి పాన్ ఇండియా నటుడుగా అనేక హిట్ చిత్రాల్లో నటిస్తు తన సత్తా చాటుతు వస్తున్న నటుడు మాధవన్(Madhavan). సఖి, చెలి వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా చూరగొన్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ వస్తున్న 'మాధవన్' జులై 11 న 'ఆప్ జైసా కోయి'(Aap jaisa Koi) అనే హిందీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మలయాళ చిత్ర రంగంలో నటీమణులు ఎదుర్కుంటున్న లైంగిక ఇబ్బందులతో పాటు వర్క్ కి సంబంధించిన పలు సమస్యలపై కేరళ ప్రభుత్వం 'జస్టిస్ హేమ కమిటీ ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో హేమ కమిటీ(Hema Committee)కి చెందిన సభ్యులు మలయాళ చిత్ర పరిశ్రమపై పూర్తి అధ్యయనం చేసి, పరిశ్రమలో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని నిర్దారించారు. అందుకు సంబంధించి సుమారు 235 పేజీల రిపోర్ట్ తో కూడిన నివేదికని కేరళ ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో పలువురు మాజీ, కొత్త నటీమణులు మలయాళ చిత్ర సీమలో తాము ఎదుర్కున్న లైంగిక సమస్యలని బహిరంగంగా వెల్లడించారు.