English | Telugu

ఢీ సీజన్ 20 త్వరలో

బుల్లితెర మీద ఫేమస్ ఢీ డాన్స్ షో సీజన్ 20 త్వరలో మొదలుకాబోతోంది. ఐతే ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’ కొత్త సీజన్ మొదలవ్వనుంది. ఈ కొత్త సీజన్ కి కూడా యాంకర్ గా నందు వచ్చాడు. ఐతే జడ్జెస్ గా విజయ్ బిన్నీ మాష్టర్ రాగా లేడీ జడ్జ్ గా రెజీనా కసాండ్ర రాబోతోంది. తాజాగా ఈ ఢీ న్యూ సీజన్ గ్రాండ్ లాంచో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్స్ ప్రతీ బుధవారం, గురువారం రాత్రి 9 .30 కి ప్రసారం కాబోతోంది. ఇక ఢీ హిస్టరీలో కొన్ని మైల్ స్టోన్స్ ఉండబోతున్నాయన్న విషయం తెలుస్తోంది. పల్సర్ బైక్ ఝాన్సీ, మణికంఠ, జానూ లిరి, అభి మాష్టర్, సుస్మిత ఆనాల, జతిన్, రాజు, పండు మాష్టర్, భూమిక, అన్షు రెడ్డి ఉండబోతున్నారు. అలాగే శ్రీవాణి కూతురు రాజనందిని కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతోంది. విక్రమాదిత్య వచ్చి కూతురి కాళ్లకు నల్ల తాడు కట్టాడు. జాను లిరి వాళ్ళ అబ్బాయి కూడా స్టేజి మీదకు వచ్చాడు.

ఢీ 20 ఇది సార్ మా బ్రాండ్ అనే టైటిల్ తో ఈ న్యూ ఎపిసోడ్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక నెటిజన్స్ ఐతే వస్తున్న డాన్స్ మాష్టర్లు పేర్లు మెన్షన్ చేస్తూ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఐతే ఈ మెగా లంచ్ ఎప్పుడు ఉండబోతోంది ఎవరు లాంచ్ చేయబోతున్నారు అన్న డీటెయిల్స్ ని ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచారు మేకర్స్.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.