English | Telugu

రామోజీరావు పై చిరంజీవి కీలక వ్యాఖ్యలు.. ఆ రోజు ఇంటికి కేక్ పంపించి కోయించారు 

ప్రముఖ సినీ నిర్మాత, రామోజీ ఫిలిం సిటీ అధినేత,'రామోజీరావు'(Ramoji Rao)గారు, బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి 'ఈటీవీ' (Etv)అనే ఛానల్ ని స్థాపించిన విషయం తెలిసిందే. 1995 అగస్ట్ 27 న ప్రారంభమైన 'ఈటీవీ' ప్రస్తుతం పలు ఛానల్స్ ని అనుసంధానంగా చేసుకొని భారతదేశంలోని పలు భాషల్లో విస్తరించి ఉంది. సదరు చానల్స్ లో వచ్చే కార్యక్రమాలన్నీ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తు వస్తున్నాయి. రీసెంట్ గా ఈటీవీ 30 వ వార్షికోత్సవ వేడుకలు ఫిలింసిటీలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు 'ఈటీవీ' 30 వ వార్షికోత్సవ సభకి రావడం నా భాద్యత. 1995 లో జరిగిన ఈటీవీ ప్రారంభ వేడుక నా కళ్ళ ముందు ఉంది. మొదటి వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా రావడంతో పాటు 20 వ వార్షికోత్సవానికి కూడా వచ్చాను. కొవిడ్ కారణంగా 25 వ వార్షికోత్సవం చేయలేకపోయారు. కానీ నా మీద ప్రేమతో మా ఇంటికి కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. ఆ సమయంలో నేను పొందిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. మళ్ళీ ఈ వేడుకలో భాగం కావడం నా అదృష్టం.

రామోజీరావు గారు నాకెప్పుడు స్ఫూర్తే. ఎప్పుడు కలిసినా, ఆయన చెప్పే మాటల ద్వారా కొత్త విషయాలు నేర్చుకునే వాడ్ని. ఎక్కడో పల్లెటూరిలో పుట్టిన రామోజీరావు గారు, మనం ఉండాల్సింది ఇక్కడ కాదు, చరిత్ర సృష్టించాలని భావించారు. ఈనాడు, మార్గదర్శి, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ తో అనుకున్నట్టుగానే ఆయన తన పేరుని చరిత్రలో శాశ్వతంగా ఉండేలా చేసుకున్నారని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు(K.Raghavendrarao)నిర్మాత సురేష్ బాబు(Suresh Babu)కీరవాణి(Keeravani)ఖుష్భు(Kushboo),మురళి మోహన్(Murali Mohan)తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.