English | Telugu

రీతూ నా మరదలు ..నాన్నకి కాన్సర్..ఆ సింపతిని అడ్డుపెట్టుకోవాలని అనుకోలేదు

బిగ్ బాస్ హౌస్ లో డెమోన్ పవన్, రీతూ చౌదరి అల్లరి గురించి తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు వీళ్ళు బిబి జోడిలో కూడా కలిసి డాన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఇక డీమన్ పవన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు. "నిజానికి నాకు మరదలు లేదు. కానీ రీతూ నాకు మరదలి లెక్క. బిగ్ బాస్ హౌస్ లో అలాగే ఉన్నాను. అందుకే బావమరదళ్ళ సరదాలు ముచ్చట్లు అవన్నీ ఉన్నాయి మా మధ్యన. అందుకే రాముని నేను బామ్మర్ది అన్నాను. బయటకు వచ్చాక అలాగే ఉంటారా అని చాలామంది అడిగారు.

నిజానికి బయటకు వచ్చాక ఒక్క గొడవ కూడా మాకు అవలేదు. హౌస్ లో మా బాండ్ జెన్యూన్ కాబట్టి బయటకు వచ్చాక కూడా అలాగే ఉన్నాం. నాకు రీతూ ఒక మెంటార్ లా కూడా. షూట్స్ విషయంలో సీనియర్ కాబట్టి అలా చెయ్యి ఇలా చెయ్యి అని సలహాలు ఇస్తుంది. ఐతే బిగ్ బాస్ నుంచి వచ్చాక ఇంకా నాకు రెమ్యూనరేషన్ పడలేదు. ఒకవేళ పడితే నేను మా బ్రదర్ కి మా బావగారికి ఇవ్వాలి. వాళ్ళు నా కోసం 10 లక్షల వరకు స్పెండ్ చేశారు. బిగ్ బాస్ అగ్నిపరీక్షకు వచ్చే ముందే నాన్నను టంగ్ కాన్సర్ ఉందని తెలిసింది. ట్రీట్మెంట్ చేయించాం. సక్సెస్ అయ్యింది. ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి నేను సింపతీ మీద మా డాడీని అడ్డుపెట్టుకుని వెళ్లాలని అనుకోలేదు.

మా డాడీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాకే అందరికీ తెలిసింది. మా నాన్న ఎవరికీ ఎప్పుడూ ఏమీ హాని చేయలేదు. నాతో జోవియల్ గా ఉండేవాళ్ళు. అలా కస్టపడి పైకొచ్చిన నాన్నకు ఇలా వచ్చిందేంటా అనుకున్న. ఆయన మంచితనమే నాకూ వచ్చింది. నాకు వచ్చే ప్రొపోజల్స్ కూడా నాన్నకు చెప్పేస్తాను. అందుకే జనాలు కూడా నన్ను థర్డ్ పొజిషన్ లో పెట్టారు. నేను కొంచెం గ్రో అయ్యాను." అంటూ చెప్పుకొచ్చాడు.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.