English | Telugu
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకి హీరోయిన్ గా రష్మీనే అనుకున్నారట
Updated : Feb 2, 2026
జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో వచ్చేసింది. ఇందులో పృద్వి స్కిట్ రష్మీ మీద చేస్తున్నట్టు కనిపిస్తోంది. పృద్వి లంగావోణీ వేసుకుని "చంద్రుళ్ళో ఉండే కుందేలు" అనే సాంగ్ కి డాన్స్ వేసుకుంటూ వచ్చింది. "ఈరోజు నా లిల్లీ పెళ్లి అందువల్లే కార్డులు పంచడానికి వచ్చాను" అంటూ ఒక కాగితాన్ని రష్మీ చేతికి ఇచ్చి ఏడవడం మొదలుపెట్టాడు. "ఏమైంది పృద్వి ఏడుస్తున్నావ్" అని అడిగింది. "ఊళ్ళో ఎవరెవరికో పెళ్ళిళ్ళైపోతున్నాయి. ఊరు పుట్టక ముందు నువ్వు పుట్టావ్...నీకు అవలేదు కదా ఇంకా" అనేసరికి రష్మీ మూతి తిప్పుకుంది. "అసలేం మాట్లాడుతున్నావ్. ప్రభాస్ సర్ ఏమన్నారు. సీనియర్స్ తర్వాతే మేము అన్నారు." అంది రష్మీ "ఆయన సీనియర్స్ తర్వాత మేము అన్నాడు ముస్లలోళ్ళ తర్వాత అనలేదు" అంటూ పృద్వి మళ్ళీ సెటైర్ వేసాడు.
"నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకి హీరోయిన్ గా ఫస్ట్ నన్ను అడిగారు తెలుసా" అంది రష్మీ. "నువ్వే వస్తాను అనుంటావ్ వాళ్ళే వద్దని ఉంటారు" అంటూ పృద్వి మళ్ళీ కౌంటర్ వేసాడు. ఇక తర్వాత రాంప్రసాద్ "టు రోజెస్ బ్యూటీ పార్లర్" అని పెట్టాడు. "నీకొక ఆఫర్ ఇస్తున్నా రష్మీ. బేసిక్ గా మన పార్లర్ లో అందంగా లేని అమ్మాయిలు ఫేషియల్ చేసుకుంటే పది వేలు తీసుకుంటాం. అందమైన అమ్మాయిలు చేయించుకుంటే జస్ట్ వెయ్యి రూపాయలు తీసుకుంటాం" అన్నాడు. "ఐతే నాకు వెయ్యి రూపాయలేనా" అని రష్మీ చాలా ఆసక్తిగా అడిగింది. "నీకు పది వేలు తీసుకుంటాం" అన్నాడు రాంప్రసాద్. అంతే రష్మికి కోపమొచ్చేసింది.