English | Telugu

ఆర్ధికంగా దివాలా తీశానని విశాల్ ప్రకటించబోతున్నాడా! అభిమానుల్లో కలవరపాటు  

-విశాల్ కి షాక్ ఇచ్చిన కోర్టు
-దివాళా తీశానని చెప్తాడా!
-కోర్టు తీర్పు వెనక ఉన్న కథ ఏంటి?
-మరి అప్ కమింగ్ సినిమా పరిస్థితి
-సాయి ధన్సిక తో పెళ్లి ఎప్పుడు!

విశాల్(Vishal)కి ఉన్న సినీ చరిష్మా తెలిసిందే. యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరైన విశాల్ రెండు దశాబ్డల నుంచి తన ఇమేజ్ ని సినిమా సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై విశాల్ ప్రదర్శించే నటనకి అభిమానులు, ప్రేక్షకులు అంతలా ముగ్ధులైపోతారు. రీసెంట్ గా ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సిక(sai dhanshika)తో ఎంగేజ్మెంట్ జరగడంతో పెళ్లి డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా విశాల్ కి సంబంధించి కోర్టు వ్యాఖ్యానించిన మాటలు అభిమానులని కలవరపాటుకి గురి చేస్తున్నాయి.


విశాల్ కి ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా(Lyca)ప్రొడక్షన్ కి మధ్య సినిమా పంపిణి హక్కుల కి సంబంధించిన విషయంలో ఆర్థిక పరమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి.ఈ క్రమంలో లైకా
సంస్థ నష్టపరిహారాన్ని కోరుతురెండున్నర సంవత్సరాల క్రితం కోర్టులో పిటిషన్ వేసింది. పరిలించిన కోర్ట్ లైకా కి 30 శాతం వడ్డీ తో 21 . 29 కోట్ల రూపాయలని విశాల్ చెల్లించాలని జూన్ లో తీర్పుని ప్రకటించింది. ఆ తీర్పుని సవాలు చేస్తు విశాల్ హైకోర్టులో అప్పీల్ చేసాడు.

రీసెంట్ గా ఈ కేసు విచారణకి వచ్చింది. న్యాయమూర్తి తో విశాల్ తరుపు న్యాయవాదులు మాట్లాడుతూ 'మా క్లయింట్ విశాల్ ధనవంతుడు కాదు.డబ్బు చెల్లించలేడని తెలిపారు. సదరు వ్యాఖ్యలపై కోర్టు స్పందిస్తు 'అయితే విశాల్ దివాళా తీసాడని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా! కోట్ల రూపాయల ఆర్ధిక లావాదేవీల విషయంలో కేసు జరుగుతుంటే ధనవంతుడు కాదని చెప్పడం ఏంటని కోర్టు మండిపడింది. అదే సమయంలో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తు విశాల్ 10 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.


Also Read:రాముడిగా చేస్తు నాన్ వెజ్ తింటావా!. రణబీర్ పై నెటిజన్స్ ఫైర్


ప్రముఖ సినీ ఫైనాన్షియర్‌, నిర్మాత అన్బుచెళియన్ దగ్గర విశాల్‌ 21 కోట్ల రూపాయిల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ రుణాన్ని విశాల్ తరుపున లైకా ప్రొడక్షన్స్ చెల్లించింది. ఆ సమయంలో విశాల్‌ నటించే చిత్రాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇవ్వాలని అగ్రిమెంట్ కూడా చేసుకుంది. కానీ విశాల్‌ అగ్రిమెంట్ కి వ్యతిరేకంగా రైట్స్‌ని లైకాకు ఇవ్వకపోగా తనే సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు.

రుణాన్ని కూడా చెల్లించలేదు. విశాల్ ప్రస్తుతం‘మకుటం’ అనే మూవీ చేస్తున్నాడు. దర్శకుడు కూడా తనే. దీంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మకుటం పై ఆసక్తి నెలకొని ఉంది. హిట్ చిత్రాలకి బాండ్ అంబాసిడర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తుండంతో ఆ ఆసక్తి మరింతగా పెరిగింది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.