English | Telugu

యాక్షన్‌ నుంచి లవ్‌ స్టోరీకి.. రూటు మార్చిన వరుణ్‌తేజ్‌!

ఇప్పటివరకు 14 సినిమాల్లో హీరోగా నటించిన వరుణ్‌తేజ్‌కి పట్టుమని 5 హిట్స్‌ కూడా లేవు. అందులోనూ ఈమధ్యకాలంలో గాండీవధారి అర్జున, ఆపరేషన్‌ వాలెంటైన్‌, మట్కా వంటి సినిమాలు ఘోర పరాజయాల్ని చవిచూశాయి. దీంతో సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు వరుణ్‌. ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు. అందుకే కొత్తదనం ఉన్న సబ్జెక్ట్‌లనే ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్‌ కనకరాజు’ అనే డిఫరెంట్‌ మూవీ చేస్తున్నారు. యాక్షన్‌తోపాటు కామెడీ కూడా ఉండే ఈ సినిమా డెఫినెట్‌గా వరుణ్‌కి మంచి సినిమా అవుతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో వరుణ్‌ గెటప్‌ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘కొరియన్‌ కనకరాజు’ చిత్రం నవంబర్‌ చివరి వారంలో పూర్తవుతుంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే మరో కొత్త సినిమాని స్టార్ట్‌ చేయబోతున్నారు వరుణ్‌. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో ఓ సినిమా గతంలోనే ఫైనల్‌ అయింది. ఏడాది తర్వాత ఈ సినిమాను మళ్లీ లైన్‌లోకి తెచ్చారు. గత ఏడాది విక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా ఓకే అనుకున్నప్పటికీ స్క్రిప్ట్‌ పక్కాగా రెడీ అవ్వకపోవడం, షెడ్యూల్స్‌ విషయంలో క్లారిటీ లేని కారణంగా కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారు. ఇప్పుడు అన్ని విషయాల్లోనూ క్లారిటీ రావడంతో డిసెంబర్‌ నుంచి షూటింగ్‌ మొదలు పెట్టాలని డిసైడ్‌ అయ్యారట. ఈమధ్యకాలంలో వరుణ్‌ చేయని రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.

విభిన్నమైన ప్రేమకథతో రూపొందనున్న ఈ సినిమా యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుందని, అలాగే సినిమాలో ఆడియన్స్‌ని భావోద్వేగానికి గురిచేసే ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను రెగ్యులర్‌ లవ్‌స్టోరీలా కాకుండా డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చెయ్యబోతున్నారని సమాచారం. ఈ సినిమా తప్పకుండా వరుణ్‌ని మళ్ళీ హిట్‌ ట్రాక్‌లోకి తెస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ ప్రేమకథకు అనువైన హీరోయిన్‌ కోసం అన్వేషిస్తున్నారు. అలాగే మిగిలిన నటీనటులకు సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.