English | Telugu

'త్రిశంక్' కూడా కేనన్ 5డి తోనే- వర్మ

"త్రిశంక్" కూడా కేనన్ 5డి తోనే తీస్తానని ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ మీడియాకు తెలియజేశారు. గతంలో ఈ "త్రిశంక్" చిత్రం పేరుని "డిపార్ట్ మెంట్" అని అనుకున్నారు వర్మ. ఈ "త్రిశంక్" చిత్రాన్ని హిందీలో భారీ తారాగణంతో రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్నారు. ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, "ఖల్ నాయక్" గా పేరుపడ్డ సంజయ్ దత్ వంటి ప్రముఖ తారాగణం ఈ రామ్ గోపాల వర్మ "త్రిశంక్" చిత్రంలో నటిస్తున్నారు.

తన ఈ "త్రిశంక్" చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నా కూడా తాను ఈ "త్రిశంక్" చిత్రాన్ని "కేనన్ 5-డి" కెమెరాతోనే నిర్మించనున్నానని రామ్ గోపాల వర్మ ఘంటాపధంగా నొక్కి వక్కాణిస్తున్నారు.

దీనికి కారణమేంటని అడిగితే "మనం ఏ కెమెరాతో మూవీ తీశామో సగటు ప్రేక్షకుడికి అనవసరం. సినిమా బాగా కనపడుతుందా...? లేదా...? సినిమాలో కంటెంట్‍ ఎంత ఆసక్తికరంగా ఉంది అన్నది మాత్రమే సగటు ప్రేక్షకుడు ఆలోచిస్తాడు..అంతే కానీ మనం యారీ-3 కెమెరా వాడామా, బి 435 కెమెరా వాడామా లేక పేనావిజన్ కెమెరా వాడామా, మూవీ మోషన్ కెమెరా వాడామా అనేది వారికి అనవసరం. అందుకే నేను నా ప్రతి చిత్రాన్నీ "కేనన్ 5-డి" కెమెరాతోనే నిర్మిస్తాను" అని రామ్ గోపాల వర్మ మీడియాకు తెలియజేశారు. దటీజ్ రామ్ గోపాల వర్మ...మిగిలిన దర్శకులు కూడా ఇలా విభిన్నంగా ఎందుకు ఆలోచించరో...

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.