English | Telugu

పన్వేల్ లోని భూమి ముమ్మాటికి సోనుసూద్ దే.. సేవాగుణంలో నెంబర్ వన్ కదా

సుదీర్ఘ కాలం నుంచి పాన్ ఇండియా యాక్టర్ గా తన సత్తా చాటుతు వస్తున్నాడు 'సోనుసూద్'(Sonu Sood). అంతే స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులని కూడా సంపాదించాడు. సేవా గుణంలో కూడా ముందుండే సోనుసూద్ రీసెంట్ గా ముంబై లోని పన్వేల్ లో 777 చదరపు గజాల భూమిని కొనుగోలు చేసాడు. సదరు ల్యాండ్ విలువ స్టాంప్ డ్యూటీ లతో కలుపుకొని మొత్తం 1 .09 కోట్లుగా తెలుస్తుంది.

పన్వేల్(Panvel)ప్రాంతం ముంబై(Mumbai)నుంచి పూణే(Pune)మార్గంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి బడా కంపెనీలు లేకపొయినా త్వరలోనే ఐటి ప్రాజెక్ట్స్, విద్యాసంస్థలు రాబోతున్నాయంట. అందుకే సోనుసూద్ ప్లాట్ ని కొనుగోలు చేసినట్టుగా టాక్. సోను సూద్ కొన్ని రోజుల క్రితం ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ఉన్న తన ఫ్లాట్ ని అమ్మి రెండున్నర కోట్ల రూపాయలని లాభాలు పొందాడు. ఆ తర్వాత తన కుమారుడు పేరుపై ముంబై లోనే ఖరీదైన ప్లాట్ ని కొన్నాడు. ఇలా తక్కువ వ్యవధిలోనే స్థిరచరాస్తులకి సంబంధించి సోనుసూద్ క్రయ, విక్రయాలు చెయ్యడంతో, సంబంధిత వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి.

కెరీర్ పరంగా చూసుకుంటే సోను సూద్ ఈ ఏడాది జనవరిలో 'ఫతే' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోతో పాటు నిర్మాతగాను వ్యవహరించగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ని అందుకుంది.



సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.