English | Telugu

ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది.. ఎక్స్ వేదికగా స్పందించిన రష్మిక 

శుక్రవారం తెల్లవారుజామున ప్రతి ఒక్కరి హృదయం తల్లడిల్లిపోయేలా హైదరాబాద్(Hyderabad)నుంచి బెంగుళూరు(Bengaluru)వెళ్తున్న ప్రవైట్ బస్ కర్నూలు(Kurnool) సమీపంలోని చిన్నటేకూరు(Chinna tekur)జాతీయ రహదారి వద్ద అగ్నికి ఆహుతయ్యింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. అందరి శరీరాలు మాంసం ముద్దలుగా మిగిలాయి.వాళ్ళల్లో చిన్న పిల్లలు కూడా ఉండటం అత్యంత బాధాకరం.

ఈ విషయంపై రష్మిక స్పందిస్తు కర్నూల్ బస్ ప్రమాద సంఘటన అత్యంత విషాదకరం. ఆ వార్త వినగానే నా హృదయం ముక్కలయ్యింది.ఎంతగానో బాధపడుతున్నాను. మండుతున్న బస్ లోపల చనిపోయిన ప్రయాణికులు అనుభవించిన బాధ వర్ణనాతీతం.కాలిపోయే ముందు వాళ్ళ ఎంత బాధ పడ్డారో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది.ఇందులో ఇద్దరు చిన్న పిల్లలతో సహా ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్దిస్తున్నాని ఎక్స్ వేదికగా తెలిపింది.

సోనుసూద్(Sonu Sood),కిరణ్ అబ్బరం(Kiran Abbavaram)తో పాటు చాలా మంది నటులు,నటీమణులు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు. ఇక బైక్ ని ఢీ కొట్టిన తర్వాత డ్రైవర్ బస్ ని వెంటనే ఆపి ఉంటే అందరి ప్రాణాలు మిగిలేవి. అలా చేయకుండా బైక్ ని సుమారు 200 మీటర్లు ఈడ్చుకెళ్లాడు.దీంతో బైక్ కి చెందిన పెట్రోల్ పంప్ మూత ఊడిపోవడంతో అగ్గి రవ్వలు చెలరేగి బస్ మొత్తం వ్యాపించడంతో బస్ అగ్నికి ఆహుతయినట్టుగా తెలుస్తుంది. బస్ కి చెందిన సెన్సర్లు పనిచేయక పోవడంతో ఆటోమేటిక్ డోర్స్ లాక్ అవ్వడం కూడా ప్రమాద తీవ్రతకి కారణమని తెలుస్తుంది. దీంతో రవాణాశాఖ అధికారులు ఇప్పటికైనా కఠినమైన నిబంధనలు అమలు చెయ్యాలని సోషల్ మీడియా వేదికగా పలువురు కోరుతున్నారు.