English | Telugu

ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది.. ఎక్స్ వేదికగా స్పందించిన రష్మిక 

శుక్రవారం తెల్లవారుజామున ప్రతి ఒక్కరి హృదయం తల్లడిల్లిపోయేలా హైదరాబాద్(Hyderabad)నుంచి బెంగుళూరు(Bengaluru)వెళ్తున్న ప్రవైట్ బస్ కర్నూలు(Kurnool) సమీపంలోని చిన్నటేకూరు(Chinna tekur)జాతీయ రహదారి వద్ద అగ్నికి ఆహుతయ్యింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. అందరి శరీరాలు మాంసం ముద్దలుగా మిగిలాయి.వాళ్ళల్లో చిన్న పిల్లలు కూడా ఉండటం అత్యంత బాధాకరం.

ఈ విషయంపై రష్మిక స్పందిస్తు కర్నూల్ బస్ ప్రమాద సంఘటన అత్యంత విషాదకరం. ఆ వార్త వినగానే నా హృదయం ముక్కలయ్యింది.ఎంతగానో బాధపడుతున్నాను. మండుతున్న బస్ లోపల చనిపోయిన ప్రయాణికులు అనుభవించిన బాధ వర్ణనాతీతం.కాలిపోయే ముందు వాళ్ళ ఎంత బాధ పడ్డారో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది.ఇందులో ఇద్దరు చిన్న పిల్లలతో సహా ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్దిస్తున్నాని ఎక్స్ వేదికగా తెలిపింది.

సోనుసూద్(Sonu Sood),కిరణ్ అబ్బరం(Kiran Abbavaram)తో పాటు చాలా మంది నటులు,నటీమణులు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు. ఇక బైక్ ని ఢీ కొట్టిన తర్వాత డ్రైవర్ బస్ ని వెంటనే ఆపి ఉంటే అందరి ప్రాణాలు మిగిలేవి. అలా చేయకుండా బైక్ ని సుమారు 200 మీటర్లు ఈడ్చుకెళ్లాడు.దీంతో బైక్ కి చెందిన పెట్రోల్ పంప్ మూత ఊడిపోవడంతో అగ్గి రవ్వలు చెలరేగి బస్ మొత్తం వ్యాపించడంతో బస్ అగ్నికి ఆహుతయినట్టుగా తెలుస్తుంది. బస్ కి చెందిన సెన్సర్లు పనిచేయక పోవడంతో ఆటోమేటిక్ డోర్స్ లాక్ అవ్వడం కూడా ప్రమాద తీవ్రతకి కారణమని తెలుస్తుంది. దీంతో రవాణాశాఖ అధికారులు ఇప్పటికైనా కఠినమైన నిబంధనలు అమలు చెయ్యాలని సోషల్ మీడియా వేదికగా పలువురు కోరుతున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.