English | Telugu

రాముడిగా చేస్తు నాన్ వెజ్ తింటావా!. రణబీర్ పై నెటిజన్స్ ఫైర్   


-రణబీర్ ఏం చేసాడు?
-భారతీయులు గర్వపడే సినిమా
-నెటిజెన్స్ ఫైర్
-బడ్జెట్ 4000 కోట్లు

భారతీయులతో పాటు రామ భక్తులందరు సగర్వంగా తలెత్తుకొని ఇది మా మూవీ అని ప్రపంచ సినిమాకి చెప్పుకునే విధంగా 'రామాయణ'(Ramayana)తెరకెక్కుతుంది. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా బడ్జెట్ సుమారు 4000 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి రామాయణ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. రాముడు గా రణబీర్ కపూర్(Ranbir kapoor),సీతమ్మ తల్లిగా సాయిపల్లవి(saipallavi)తమ ప్రాణం పెట్టి చేస్తున్నారు. రామాయణ కోసం చిత్ర యూనిట్ లో చాలా మంది తమ వ్యక్తిగత అలవాట్లని మార్చుకుంటున్నామని కూడా ప్రకటించారు.

ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం రణబీర్ కి చెందిన పీఆర్ టీం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు రాముడి పాత్ర చేస్తున్న దగ్గర్నుంచి రణబీర్ సర్ నాన్ వెజ్, సిగరెట్, ఆల్కహాల్ అన్నీ ఆపేసారు. సాట్విక్ ఫుడ్, యోగా, మెడిటేషన్‌తో చాలా పద్దతిగా ఉంటున్నారని ప్రకటించింది. దీంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్,రామభక్తులు రణ్​బీర్​ని మెచ్చుకున్నారు. కానీ రీసెంట్ గా 'డైనింగ్ విత్ ది కపూర్స్’ డాక్యుమెంటరీ కి సంబంధించిన వీడియో ఒకటి బయటకి వచ్చింది.

సదరు వీడియోలో రణబీర్ తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తున్నాడు. నీతూ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, రీమా జైన్, సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఫిష్ కర్రీ, రైస్, జంగిల్ మటన్, పాయా వంటి వాటిని రణబీర్ సోదరుడు అర్మాన్ జైన్ సర్వ్ చేస్తుంటే అందరూ తింటూ ఉన్నారు.

also read:పెద్దిలో జాన్వీ కపూర్ కి డూప్ ని పెట్టారా!.. బాంధవి శ్రీధర్ ఎవరు

ఇప్పుడు ఈ వీడియో నెటిజన్స్ కంటపడటంతో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు రాముడిగా చేస్తు మటన్ తింటావా? సాట్విక్ డైట్ అనేది అబద్ధమేనా?అని నెటిజన్స్​ మండిపడుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో #RanbirHypocrisy,#RamayanaControversy లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.మరి ఈ విషయంపై రణ్​బీర్​ టీమ్​ ఏ వివరణ ఇస్తుందో చూడాలి. వచ్చే ఏడాది దివాలి కానుకగా మొదటి భాగం, ఆ పై ఏడాది దివాలి కి రెండవ భాగం విడుదల కానున్నాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ 'యష్'(Yash)రావణుడిగా చేస్తుండగా దంగల్ మూవీ ఫేమ్ నితీష్ తివారి(Nitesh Tiwari)దర్శకుడు. నమిత్ మల్హోత్రా(Namit Malhotra)నిర్మాణ సారధ్యంలో ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.