English | Telugu

వారణాసి లో నీ రెమ్యునరేషన్ ఎంత.. పట్టించుకోవడమంటే ఇది 

-బడ్జెట్ ఎంత
-మహేష్ డ్యూయల్ రోల్ నిజమేనా
-వారణాసి రాక కోసం ఎదురుచూపులు
-రెమ్యునరేషన్స్ ఎంత!

మహేష్ బాబు(Mahesh Babu),రాజమౌళి(Rajamouli),ప్రియాంక చోప్రా(Priyanka Chopra)పాన్ వరల్డ్ మూవీ 'వారణాసి'(Varanasi)పై సినీ ప్రేమికుల దృష్టి పడింది. దీంతో సిల్వర్ స్క్రీన్ పై 'వారణాసి' అడుగుపెట్టేంత వరకు అప్ డేట్స్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూనే ఉంటారు.అంతలా వారణాసి రోజు రోజుకి తన క్రేజ్ ని పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలో నటీనటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా 'మందాకినీ' అనే రోల్ లో చేస్తున్నందుకు సుమారు 30 కోట్లరూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఈ న్యూస్ వస్తుండటంతో అందరు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మేకర్స్ ఆమెకి అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రధాన కారణం, ప్రియాంక చోప్రా ఇప్పుడు పాన్ వరల్డ్ నటిగా ఉంది. గత కొన్నేళ్లుగా హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులని అలరిస్తూ వస్తుంది. అభిమాన ఘనం కూడా ఎక్కువే. బాలీవుడ్ లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.అందుకే మేకర్స్ 30 కోట్లు ఇచ్చి ఉంటారనే మాటలు వినపడుతున్నాయి. ప్రియాంక చోప్రా హస్బెండ్ నిక్ జోనాస్ హాలీవుడ్ లో పేరు మోసిన పాప్ సింగర్ అనే విషయం తెలిసిందే.

Also Read:ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊహించని ఇద్దరు అతిధులు! ఫ్యాన్స్ ఏమంటారో మరి


ఇక రెమ్యూనరేషన్స్ విషయంలోనే మహేష్, రాజమౌళి ఎంత తీసుకుంటారనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. వారణాసి భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. చిత్ర వర్గాలు అధికారకంగా ప్రకటించకపోయినా 1500 కోట్ల రూపాయల బడ్జెట్ అని టాక్. రుద్రగా మహేష్, మలయాళ స్టార్ హీరో, దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కుంభ అనే క్యారక్టర్ లో కనిపిస్తున్నారు. 2027 లో ప్రేక్షకుల ముందుకు రానుండగా మహేష్ బాబు డ్యూయల్ రోల్ అనే టాక్ కూడా చాలా బలంగా ఉంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.