English | Telugu

ఎవరు ఎటు వైపు..  ఏం జరగబోతుంది!

-చిరంజీవి ఎటు వైపు
-రాజమౌళి ఎటు వైపు
-ఏం జరగబోతుంది
-రాజమౌళి పై హిందూ సంఘాల ఆగ్రహం

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli). ఈ ఇద్దరి లెజండ్స్ వల్ల తెలుగు సినిమాకి వచ్చిన గుర్తింపు మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. అభిమాన బలం కూడా ఎక్కువే. పోస్టర్ పై ఈ ఇద్దరి ఫోటో కనపడితే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడతారు. ఇప్పుడు ఈ ఇద్దరి గురించి కాదేది చర్చకి అనర్హం అనే రీతిలో లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా వాడి వేడి చర్చ జరుగుతుంది.


రాజమౌళి రీసెంట్ గా తన అప్ కమింగ్ మూవీ 'వారణాసి'(Varanasi)ఫంక్షన్ లో మాట్లాడుతు 'దేవుడ్నినమ్మనని, ఆంజనేయుడు నన్ను నడిపిస్తాడని మా నాన్న చెప్పాడు. ఇదా నన్ను నడిపించేది అని అసహనంగా మాట్లాడటం జరిగింది. ఈ మాటలు హిందూసంఘాలకి, ఆంజనేయ స్వామి భక్తులకి ఆగ్రహాన్ని తెప్పించాయి. రాజమౌళి పై పోలీస్ కేసు నమోదు చెయ్యడంతో పాటు పలు ఛానెల్స్ లో రాజమౌళి కి వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. రాజమౌళి కి చెందిన ఈ ఎపిసోడ్ మొత్తాన్నిసోషల్ మీడియా వేదికగా కొంత మంది చిరంజీవి కి లింక్ చేస్తున్నారు. చిరంజీవి ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు. తన ఉఛ్వాస, నిచ్వాస ల్లోను ఆంజనేయుడినే తలుచుకుంటూ ఉంటాడు. తన జీవితం ఎదుగుదలతో పాటు తన కుటుంబసభ్యులు బాగుండటానికి ఆంజనేయుడు కారణం అని బలంగా నమ్ముతాడు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్నీ చిరంజీవి నే స్వయంగా చెప్పాడు.

also read:అంతా నకిలీనే నమ్మకండి.. అభిమానులకి షాక్ ఇచ్చిన శ్రియా


పైగా చిరంజీవి అనే పేరే ఆంజనేయ స్వామిది. మరి ఇప్పుడు రాజమౌళి ఏమో ఆంజనేయ స్వామి నన్ను నడిపించేది ఇదా అని అన్నాడు. ఆ వ్యాఖ్యలని ప్రపంచం మొత్తం చూసింది. చిరంజీవి కూడా చూసే ఉంటాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి, రాజమౌళి ఒకరికొకరు ఎదురుపడి మాట్లాడుకోవలసి వస్తే అప్పుడు ఆ ఇద్దరి మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. చిరంజీవి, రాజమౌళి మధ్య మాత్రం సినిమాల పరంగానే కాకుండా, వ్యక్తిగతంగాను మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.