English | Telugu

టాలీవుడ్ స్టార్స్ ఎలాంటివారో చెప్పిన ప్రొడ్యూసర్ రవిశంకర్!

మెజారిటీ స్టార్ హీరోలు వారి రెమ్యూనరేషన్ వారు తీసుకోవడమే కానీ.. నిర్మాతల కష్ట నష్టాల గురించి పెద్దగా పట్టించుకోరనే అభిప్రాయాలు ఉన్నాయి. నిజంగా టాలీవుడ్ స్టార్స్ అలాగే ఉంటారా? వారికి నిర్మాతల బాధలు పట్టవా?. ఈ విషయంపై తాజాగా ప్రముఖ నిర్మాత, మైత్రి రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రామ్ పోతినేని హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' (Andhra King Taluka) గురువారం విడుదలై, పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రవిశంకర్ కి మీడియా నుండి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

Also Read: 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ డే కలెక్షన్స్!

"నిర్మాతల కష్ట నష్టాలు పట్టించుకునే హీరోలు, నిర్మాతలకు అండగా ఉండే హీరోలు ఉన్నారా?" అనే ప్రశ్న ఎదురవ్వగా.. రవిశంకర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తమ బ్యానర్ లో పనిచేసిన హీరోలందరూ మంచివారేనని కితాబిచ్చారు.

"అందరు హీరోలు సపోర్టివ్ గానే ఉంటారు. రంగస్థలం అప్పుడు రామ్ చరణ్ గారు కొంత అమౌంట్ మా దగ్గరే ఉంచి.. ఎప్పుడో సంవత్సరం రెండు సంవత్సరాలకు తీసుకున్నారు. వాళ్ళకి డబ్బు ప్రధానం కాదు. మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, రవితేజ గారు అందరూ అంతే. ఏడాది తర్వాత తీసుకున్నారు. ఓటీటీ రైట్స్ అమౌంట్ లేట్ వస్తుంది కదా.. వచ్చినప్పుడే ఇవ్వండి అనేవాళ్ళు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'కు ఉపేంద్ర గారు రెగ్యులర్ గా తీసుకునే అమౌంట్ కంటే తక్కువ ఆఫర్ చేసినా ఆయన ఒక్క మాట అనలేదు. రామ్ గారు రెమ్యూనరేషన్ తీసుకోకుండా, ఏరియా రైట్స్ తీసుకొని సపోర్ట్ గా నిలిచారు. ఎన్టీఆర్ గారైతే మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండిలే అనే టైపులో ఉంటారు. ప్రభాస్ గారు కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు మీకు మిగిలితే ఇవ్వండి లేకపోతే లేదు అన్నారు. పుష్పకి అల్లు అర్జున్ గారు కూడా ఏడాది తర్వాత రెమ్యూనరేషన్ తీసుకున్నారు." అని నిర్మాత రవిశంకర్ చెప్పుకొచ్చారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.