English | Telugu

అప్పుల్లో దర్శకధీరుడు రాజమౌళి..?

టాప్ డైరెక్టర్ రాజమౌళికి అప్పులా..!
ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం ఇండియాలోని టాప్ డైరెక్టర్స్ లో ఎస్.ఎస్. రాజమౌళి ఒకరు. ఆయన రెమ్యూనరేషన్ పాన్ ఇండియా స్టార్ హీరోల రేంజ్ లో ఉంటుంది. అలాంటి రాజమౌళికి అప్పులు ఉన్నాయనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పైగా, ఈ విషయాన్ని ప్రభాస్ రివీల్ చేయడం విశేషం.

బాహుబలి రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఒక సినిమాగా అక్టోబర్ 31న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి, ప్రభాస్, రానా ముచ్చటించిన ప్రత్యేక ఇంటర్వ్యూను తాజాగా విడుదల చేశారు.

Also Read: బాహుబలి-3 సర్ ప్రైజ్.. రాజమౌళి కీలక ప్రకటన!

బాహుబలి-1 విడుదల రోజు నెగటివ్ టాక్ రావడంతో రాజమౌళి ఎంతో టెన్షన్ పడ్డారట. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. "నేను డైరెక్టర్ ని. నేనేమి డబ్బులు పెట్టినవాడిని కాదు. కానీ, నన్ను నమ్మి డబ్బులు పెట్టిన శోభు గారు, చిన్న గారి పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డాను. వాళ్ళకి ఏమైనా చేద్దామంటే నా వెనుక ఆస్తులు కూడా లేవు. సెకండ్ పార్ట్ ని తక్కువ బడ్జెట్ లో, తక్కువ టైంలో పూర్తి చేద్దామని కూడా ఆలోచించాను." అని రాజమౌళి అన్నారు.

రాజమౌళి మాటలకు వెంటనే స్పందించిన ప్రభాస్.. "ఆస్తులేమీ లేవు సార్ దగ్గర. మొన్నటిదాకా అప్పులు కట్టుకుంటూ ఉన్నారు. ఈయన స్టోరీలు నాకు తెలుసు." అని చెప్పాడు. దీంతో ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.