English | Telugu

'పెళ్ళి చేసుకుందాం' సినిమా మీలో ఎంతమందికి ఇష్టం.. రీ రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఆల్ టైం హిట్ పెయిర్ వెంకటేష్-సౌందర్య నటించిన చిత్రాలలో 'పెళ్ళి చేసుకుందాం' ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీత చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్ పై సి.వెంకట్రాజు, శివరాజు సంయుక్తంగా నిర్మించారు. 1997, అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. (Pelli Chesukundam)

28 సంవత్సరాల తర్వాత 'పెళ్ళి చేసుకుందాం' సినిమా మళ్ళీ థియేటర్లలో '4K'లో అలరించడానికి సిద్ధమవుతోంది. వెంకటేష్ జన్మదిన కానుకగా డిసెంబర్ 13న.. సాయిలక్ష్మీ ఫిలిమ్స్ ద్వారా వరప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో తెలుగులో 300 కోట్ల క్లబ్ ఫౌండర్ హీరోగా చరిత్ర సృష్టించిన వెంకటేష్ బాబు నటించిన ఆణిముత్యాల్లో ఒకటైన "పెళ్ళి చేసుకుందాం" చిత్రాన్ని 4K లో డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు ఫ్రెష్ గా తీసుకువచ్చే అవకాశం లభించడం గర్వంగా ఉంది. మన రెండు రాష్ట్రాల్లో ఉన్న విక్టరీ ఫ్యాన్స్ తోపాటు... సిసలైన సినీ ప్రేమికులంతా "పెళ్ళి చేసుకుందాం" చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మూడేళ్లపాటు ఈ చిత్రం హక్కుల్ని మేము కలిగి ఉన్నాం" అని అన్నారు.

'పెళ్ళి చేసుకుందాం' చిత్రానికి భూపతి రాజా కథ అందించారు. ఇందులో లక్షాధికారి ఆనంద్ పాత్రలో వెంకటేష్ నటించగా, అత్యాచారానికి గురైన శాంతి పాత్రలో సౌందర్య కనిపించారు.

'పెళ్ళి చేసుకుందాం' కథ ఏంటంటే.. కాళీచరణ్ అనే వ్యక్తి చేసిన హత్యను చూసిన శాంతి, పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది. దానికి ప్రతీకారంగా కాళీచరణ్ తమ్ముడు శాంతిపై అత్యాచారం చేస్తాడు. దాంతో తల్లిదండ్రులు శాంతిని ఇంటినుండి వెళ్ళగొడతారు. విషయం తెలిసిన ఆనంద్, శాంతిని ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తాడు. రోజులు గడుస్తున్నకొద్ది ఆనంద్, శాంతి ప్రేమలో పడతాడు. నీ శాంతి అతణ్ణి దూరం పెడుతుంది. వీరి ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏంటి? చివరికి ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారనేది మిగతా కథ.

పోసాని కృష్ణమురళి రచించిన సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోటి స్వరపరిచిన పాటలన్నీ హిట్ అయ్యాయి. లైలా, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్ 13న మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి రీ రిలీజ్ లో ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.