English | Telugu

దేవర-2.. క్లారిటీ ఇచ్చేసిన ఎన్టీఆర్!

దేవర-2 ఉందా లేదా?
క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్!
కొరటాల ఏం చేయనున్నాడు?

దేవర(Devara) సినిమా విడుదలై ఏడాది దాటిపోయింది. దేవర పార్ట్-2 ఉంటుందా లేదా? అనే చర్చ కొద్ది నెలలుగా జరుగుతోంది. మొదట్లో 'దేవర-2'పై అనుమానాలు వ్యక్తమవ్వగా.. ఖచ్చితంగా ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) చెప్పాడు. దీంతో ఈ ఏడాది చివరికల్లా పట్టాలెక్కే అవకాశముందని వార్తలు వినిపించాయి. అయితే కొద్దిరోజులుగా 'దేవర-2'(Devara 2) పూర్తిగా ఆగిపోయిందనే న్యూస్ బలంగా వినిపిస్తోంది. మరి దేవర-2 నిజంగానే ఆగిపోయిందా? ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎన్టీఆర్ నిర్ణయం ఏంటి?

జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'దేవర'. పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాలతో 2024, సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టి.. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ వరల్డ్ వైడ్ గా రూ.450 కోట్ల గ్రాస్ రాబట్టి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

'దేవర' కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ సాధించినప్పటికీ, కంటెంట్ పరంగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో 'దేవర-2' ఉండకపోవచ్చని మెజారిటీ అభిమానులు కూడా భావించారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం దేవర స్క్రిప్ట్ ని, కొరటాలను నమ్మాడు. అందుకే దేవర-2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. అయితే తన ఇతర కమిట్ మెంట్స్ కారణంగా.. దేవర-2 కి డేట్స్ ఇవ్వలేకపొతున్నాడు.

Also Read:'అఖండ-2'లో శివుడిగా ఎన్టీఆర్!

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది అనుకున్న దానికంటే బాగా ఆలస్యమవుతోంది. ఆ తరువాత త్రివిక్రమ్, నెల్సన్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. దీంతో ప్రస్తుతానికి దేవర-2 కి బ్రేక్ ఇవ్వాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడట. ఇదే విషయాన్ని కొరటాలకు కూడా చెప్పాడట. తన కమిట్ మెంట్స్ పూర్తవ్వడానికి టైం పడుతుంది, ఈలోపు వేరే ప్రాజెక్ట్ చేసుకోమని ఎన్టీఆర్ చెప్పినట్లు వినికిడి. ఎన్టీఆర్ నుండి క్లారిటీ రావడంతో.. ప్రస్తుతం కొరటాల, మరో స్క్రిప్ట్ తో వేరే హీరో ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ప్రకారం.. ఎన్టీఆర్ ఇప్పటికీ దేవర-2 చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే దేవర-2 కు బ్రేక్ మాత్రమే ఇచ్చి, ఈ గ్యాప్ లో కొరటాలను వేరే ప్రాజెక్ట్ చేసుకోమని చెప్పినట్లు సమాచారం.

మరి ఈ గ్యాప్ తరువాత దేవర-2 ఉంటుందా? ఉంటే ఎప్పుడు? అనేది ఎన్టీఆర్ కే తెలియాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.