English | Telugu

వేర్ ఈజ్ ఎన్టీఆర్ 

-ఎన్టీఆర్ కి అభిమానుల విన్నపం
-సోషల్ మీడియా వేదికగా హంగామా
-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు
-రిషబ్ శెట్టి ఉన్నాడా!

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)కి ఉన్న అభిమానగణం అపారం. సుమారు రెండు దశాబ్దాలపై నుంచి ఎన్టీఆర్ కి అభిమానులకి మధ్య అభిమానం కొనసాగుతు వస్తుంది. పైగా ఆ అభిమాన గణం సినిమా సినిమాకి రెట్టింపు అవుతు ఉంది. ఈ ఏడాది ఆగస్టులో వార్ 2(War 2)తో అలరించిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel)మూవీ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత హైబడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో పాటు మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ గా కూడా నిర్మాణం జరుపుకుంటుంది. కథ, కథనాలు కూడా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ గత చిత్రాలని మించి ఉండబోతున్నాయి .దీన్ని బట్టి ఈ మూవీ కోసం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

అంతే అంచనాలతో మూవీ అప్ డేట్ కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎదురుచూస్తు వస్తున్నారు. ఎందుకంటే సదరు అప్ డేట్స్ చూసి సినిమా రిలీజ్ రోజుఎంతగా ఆనందం పొందుతారో, సోషల్ మీడియాలో వచ్చే అప్ డేట్ చూసి అంతే ఆనందం పొందుతారు. సదరు అప్ డేట్స్ ని వేరే వాళ్ళతో కూడా చేసుకుంటూ ఉంటారు. అందుకే అభిమానులు దేవుళ్లతో సమానం అని అంటుంటారు. కానీ గత కొన్ని రోజుల నుంచి మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. ఈ విషయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ఎన్టీఆర్ నీల్ ల ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుండాలని, వేరే క్యారెక్టర్స్ పై షూటింగ్ జరిగినా కూడా అప్ డేట్స్ ఇస్తుండాలని కోరుతున్నారు. సినిమాకి ఇప్పట్నుంచే పబ్లిసిటీ ఉండాలనే సలహా కూడా ఇస్తున్నారు.

also read :నా అంతరాత్మ ఒక స్వర్ణయుగం.. భాగ్యశ్రీ బోర్సే మొత్తం చెప్పేసింది


ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ మాస్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. డ్యూయల్ రోల్ అనే రూమర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా ఎన్టీఆర్ సరసన 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth)జత కడుతుంది.ఈ మేరకు మేకర్స్ రుక్మిణి పేరుని అధికారకంగా ప్రకటించడమే తరువాయి. కాంతార చాప్టర్ 1(Kantara chapter 1) తో బాక్స్ ఆఫీస్ వద్ద సునామీని సృష్టించిన రిషబ్ శెట్టి(Rishab Shetty)కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే మరో రూమర్ కూడా వినిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.