English | Telugu
వేర్ ఈజ్ ఎన్టీఆర్
Updated : Nov 12, 2025
-ఎన్టీఆర్ కి అభిమానుల విన్నపం
-సోషల్ మీడియా వేదికగా హంగామా
-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు
-రిషబ్ శెట్టి ఉన్నాడా!
మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)కి ఉన్న అభిమానగణం అపారం. సుమారు రెండు దశాబ్దాలపై నుంచి ఎన్టీఆర్ కి అభిమానులకి మధ్య అభిమానం కొనసాగుతు వస్తుంది. పైగా ఆ అభిమాన గణం సినిమా సినిమాకి రెట్టింపు అవుతు ఉంది. ఈ ఏడాది ఆగస్టులో వార్ 2(War 2)తో అలరించిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel)మూవీ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత హైబడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో పాటు మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ గా కూడా నిర్మాణం జరుపుకుంటుంది. కథ, కథనాలు కూడా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ గత చిత్రాలని మించి ఉండబోతున్నాయి .దీన్ని బట్టి ఈ మూవీ కోసం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అంతే అంచనాలతో మూవీ అప్ డేట్ కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎదురుచూస్తు వస్తున్నారు. ఎందుకంటే సదరు అప్ డేట్స్ చూసి సినిమా రిలీజ్ రోజుఎంతగా ఆనందం పొందుతారో, సోషల్ మీడియాలో వచ్చే అప్ డేట్ చూసి అంతే ఆనందం పొందుతారు. సదరు అప్ డేట్స్ ని వేరే వాళ్ళతో కూడా చేసుకుంటూ ఉంటారు. అందుకే అభిమానులు దేవుళ్లతో సమానం అని అంటుంటారు. కానీ గత కొన్ని రోజుల నుంచి మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. ఈ విషయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ఎన్టీఆర్ నీల్ ల ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుండాలని, వేరే క్యారెక్టర్స్ పై షూటింగ్ జరిగినా కూడా అప్ డేట్స్ ఇస్తుండాలని కోరుతున్నారు. సినిమాకి ఇప్పట్నుంచే పబ్లిసిటీ ఉండాలనే సలహా కూడా ఇస్తున్నారు.
also read :నా అంతరాత్మ ఒక స్వర్ణయుగం.. భాగ్యశ్రీ బోర్సే మొత్తం చెప్పేసింది
ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ మాస్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. డ్యూయల్ రోల్ అనే రూమర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా ఎన్టీఆర్ సరసన 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth)జత కడుతుంది.ఈ మేరకు మేకర్స్ రుక్మిణి పేరుని అధికారకంగా ప్రకటించడమే తరువాయి. కాంతార చాప్టర్ 1(Kantara chapter 1) తో బాక్స్ ఆఫీస్ వద్ద సునామీని సృష్టించిన రిషబ్ శెట్టి(Rishab Shetty)కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే మరో రూమర్ కూడా వినిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.